Suryapeta కోదాడలో 294మంది లబ్ధిదారులకు రూ 2.94కోట్ల చెక్కుల పంపిణీ విధాత: కుల వృత్తులను ప్రోత్సహించి వారు ఆర్థికంగా ఎదుగాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ బీసీ బంధు ద్వారా లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి తెలిపారు. సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని వైష్ణవి ఫంక్షన్ హాల్లో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కుల వృత్తుల లబ్ధిదారులు 294మందికి 2.94కోట్ల చెక్కులను […]
Suryapeta
విధాత: కుల వృత్తులను ప్రోత్సహించి వారు ఆర్థికంగా ఎదుగాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ బీసీ బంధు ద్వారా లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి తెలిపారు. సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడలోని వైష్ణవి ఫంక్షన్ హాల్లో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కుల వృత్తుల లబ్ధిదారులు 294మందికి 2.94కోట్ల చెక్కులను స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతు దేశంలో ఎక్కడా కూడా బీసీల సంక్షేమం కోసం ఇలాంటి పథకం లేదన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో 300 మందికి లక్ష రూపాయాల చొప్పున సహాయం అందజేస్తామని, జిల్లాలో ఈ పథకం అమలులను కోదాడ నుంచే ప్రారంభించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల పట్టింపులేని తనంతో కులవృత్తులు కనుమరుగయ్యాయన్నారు. అనేక వృత్తుల్లో కార్పొరేట్ సంస్థలు ప్రవేశించగా, తెలంగాణలో కులవృత్తులు సంక్షోభంలో పడ్డాయని, వృత్తిదారులు ఆర్ధిక ఇబ్బందుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని విధాల కుల వృత్తిదారులకు అండగా నిలుస్తున్నారన్నారు. ఇప్పటికే గొల్ల, కురుమలు, మత్స్యకారులకు గొర్రెలు, చేప పిల్లల పంపిణీ పథకాలతో ఆర్థిక తోడ్పాటునందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలు, చేతివృత్తుల అభ్యున్నతికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు.
బీసీ కులాల్లోని నాయీబ్రాహ్మణులు, రజక, సగర, కుమ్మరి, అవుసుల, కంసాలి, వడ్రంగి, వడ్డెర, కమ్మరి, కంచరి, మేదర, కృష్ణ బలిజ పూస, మేర, ఆరె కటిక, ఎంబీసీ కులాలకు చెందినవారికి సర్కారు సాయమందించనున్నట్లు పేర్కొన్నారు. తొమ్మిది మంది అక్కాచెల్లెళ్ల తోబుట్టువు గా ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉంటేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని నమ్మే నాయకుడు కేసీఆర్ అన్నారు.
అందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా కులవృత్తుల సంక్షేమానికి లక్షరూపాయలు అందించి ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్దేఆన్నారు . సమాజం చివరి అంచులో ఉన్న వారికి ప్రభుత్వ లక్ష్యాలను చేరాలని ఉద్దేశంతోనే లక్ష సహాయానికి శ్రీకారం చుట్టారన్నారు. గత పాలకుల హయాంలో నియోజకవర్గానికి ఇద్దరికో ముగ్గురికో లోన్లు ఇస్తే, 50 వేల లోన్కు ఆరు నెలలు తిరిగితే చివరకు 25వేలు వచ్చేవన్నారు.
ఒకసారి లబ్ది పొందిన వ్యక్తులకు మరోసారి అవకాశం రాకపోగా తీసుకున్న కొద్ది పాటి డబ్బుకు లక్ష రూపాయలు చెల్లించాల్సి వచ్చేదన్నారు. దీంతో కుటుంబ పోషణ భారమై అనేక మంది వృత్తులను వదులుకొని వలస వెళ్లారని గుర్తు చేశారు. ఈ పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో కులవృత్తులకు పునర్జీవం పోసేందుకు నడుంబిగించారన్నారు. కూలీలుగా జీవనం సాగిస్తున్న అనేక మంది వృత్తిదారులను ఓనర్లుగా మార్చేందుకే రూ.లక్ష ఆర్థిక సాయం అందించే పథకానికి శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు.
తెలంగాణ సాకారమైన తర్వాత రజక, నాయీబ్రాహ్మణ కులవృత్తులను ప్రోత్సహించే క్రమంలో ఇప్పటికే ఉచిత విద్యుత్తు పథకం ప్రారంభించి, నెలకు 250 యూనిట్లు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం స్ఫూర్తితోనే బీసీ కులాల్లో కులవృత్తులు చేసుకుంటున్న వారందరికీ సాయమందించాలనే ఆలోచనతో బృహత్తర పథకానికి సీఎం కేసీఆర్ నాంది పలికారన్నారు.
మానవ మనుగడ ఉన్నన్ని రోజులు అన్ని వృత్తులు కూడా అవసరమేనని, అందుకే కల్యాణలక్ష్మి, రైతుబంధు రైతు బీమా, 24 గంటల కరెంటు, ఆసరా పెన్షన్లు తరహాలో ఈ పథకం కూడా నిరంతరాయంగా అమలవుతుందని పేర్కొన్నారు. తెలిసో తెలియకో 2014లో కాంగ్రెస్ ను గెలిపించిన కోదాడ ప్రజలు 2018 తర్వాతే అభివృద్ధి అంటే ఏమిటో చూశారని అన్నారు. పదవుల కోసం తమను ఓటు వేసి గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టిన చరిత్ర ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులదని ఎద్దేవా చేశారు.
వారి పాలనలో సాగర్ ఆయకట్టులో ఏనాడు కూడా వరసగా మూడు పంటలకు నీళ్లు ఇచ్చిన సందర్భం లేదన్నారు. ప్రజలు ప్రశ్నిస్తే చివరి భూములు అని చెప్పి తప్పించుకున్నారు తప్పా ఏనాడు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. ఆ నాయకులకు ఆకారాలతో పాటు అహంకారము ఎక్కువ అని ఎద్దేవా చేశారు.
కోదాడలో జరుగుతున్న అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలంటే ఇక్కడి ప్రజలు గులాబీ జెండాకు, సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని కోరారు. కరువు వచ్చినప్పుడు ప్రశ్నార్థకమవుతున్న కృష్ణా ఆయకట్టు పరివాహక ప్రాంతానికి కాళేశ్వరం జలాలు తెచ్చే సాకారం రాబోయే కాలం లో కేసీఆర్తోనే సాధ్యపడుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.