• Telugu News
  • /National

తుంగభద్ర డ్యామ్‌కు 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభం

తుంగభద్ర డ్యామ్‌లో రూ.51 కోట్లతో నిర్మించిన 33 కొత్త క్రస్ట్ గేట్లను కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, సీఎంలు చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ ప్రారంభించారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jun 25, 2026, 12:58 pm IST
Read Time: 2 mins
తుంగభద్ర డ్యామ్‌కు 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభం

కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త క్రస్ట్ గేట్లను గురువారం కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ లు ప్రారంభించారు. గతంలో 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోవడంతో ఎన్డీఎస్ఏ(NDSA) సిఫార్సుల మేరకు వీటిని పునరుద్ధరించారు.

రూ.51 కోట్లతో రికార్డు స్థాయిలో 6 నెలల్లో 33 కొత్త క్రస్ట్ గేట్లను అమర్చారు. నూతన గేట్ల ప్రారంభోత్సవంలో మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు పాల్గొన్నారు.