RBI | ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా స్వామినాథన్‌

RBI | ముంబై: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)కి కొత్త డిప్యూటీ గవర్నర్‌గా స్వామినాథన్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన ఎస్‌బీఐకి ఎండీగా ఉన్నారు. ప్రస్తుత డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ మ‌హేశ్ కుమార్ జైన్ ప‌ద‌వీ కాలం జూన్ 22తో ముగుస్తుంది. 2018 జూన్‌లో జైన్ మూడేళ్ళ పాటు డిప్యూటీ గ‌వ‌ర్నర్‌గా నియ‌మితుల‌య్యారు. ప‌ద‌వీ కాలం 2021 జూన్‌లో ముగిసినా.. మరో రెండేళ్లు ఆయనకు పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. అది ముగిసిన నేపథ్యంలో ఆ స్థానంలో స్వామినాథ‌న్ జాన‌కీరామ‌న్‌ను […]

  • Publish Date - June 20, 2023 / 04:15 PM IST

RBI |

ముంబై: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)కి కొత్త డిప్యూటీ గవర్నర్‌గా స్వామినాథన్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన ఎస్‌బీఐకి ఎండీగా ఉన్నారు. ప్రస్తుత డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ మ‌హేశ్ కుమార్ జైన్ ప‌ద‌వీ కాలం జూన్ 22తో ముగుస్తుంది.

2018 జూన్‌లో జైన్ మూడేళ్ళ పాటు డిప్యూటీ గ‌వ‌ర్నర్‌గా నియ‌మితుల‌య్యారు. ప‌ద‌వీ కాలం 2021 జూన్‌లో ముగిసినా.. మరో రెండేళ్లు ఆయనకు పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది.

అది ముగిసిన నేపథ్యంలో ఆ స్థానంలో స్వామినాథ‌న్ జాన‌కీరామ‌న్‌ను నియ‌మించింది. జూన్ 22 నుండి స్వామినాథ‌న్ ఈ ప‌ద‌విలో కొన‌సాగుతారు. మూడేళ్ళ పాటు ఈ ప‌ద‌విలో ఉంటారు.