స్వర్ణాంధ్ర సాకార యాత్రలో ఘటన
విధాత : స్టార్ హీరో..హిందూపురం టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ మరోసారి తన అభిమానులపై చేయి చేసుకున్నారు. టీడీపీ విజయాన్ని కాంక్షిస్తూ సత్యసాయి జిల్లాలో శనివారం బాలయ్య చేపట్టిన స్వర్ణాంధ్ర సాకార యాత్ర ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. యాత్ర ప్రారంభం సందర్భంగా ఆయనను చూసేందుకు వచ్చిన అభిమానులు ఒక్కసారిగా తోసుకుంటు సెల్ఫీలు దిగేందుకు గుంపుగా మీద పడటంతో బాలయ్య ఆగ్రహానికి గురై వారిపై చేయి చేసుకున్నారు. ఓ అభిమానిని మోచేతితో కొట్టారు. బాలయ్య తరుచు సినిమా ఫంక్షన్లతో పాటు పార్టీ మీటింగ్లలోనూ అభిమానులు, కార్యకర్తలు అదుపు తప్పితే చేయి చేసుకోవడం పరిపాటిగా మారింది. స్వర్ణాంధ్ర సాకార యాత్ర ఎన్నికల ప్రచారంలో బాలయ్య అభిమానిపై చేయి చేసుకున్న వీడియో ఏపీ ఎన్నికల వేళ వైరల్గా మారింది.