వాట్సప్ల్లో ప్రశ్నపత్రం ప్రత్యక్షం గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది ఆందోళనలో విద్యార్థులు రంగంలోకి దిగిన వరంగల్ పోలీసులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టెన్త్ పరీక్షల తొలిరోజే సోమవారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో ప్రశ్న పత్రం లీక్ అయిందని ఆరోపణలు నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు లోనవుతుండగా మంగళవారం వరంగల్లో టెన్త్ హిందీ పేపర్ లీక్ అయ్యింది. ఉదయం 9:30 గంటలకే హిందీ ప్రశ్న పత్రం వాట్సాప్ గ్రూపు లలో ప్రత్యక్షమైంది. ఈ ప్రశ్న పత్రం అన్ని గ్రూపుల్లో […]
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టెన్త్ పరీక్షల తొలిరోజే సోమవారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో ప్రశ్న పత్రం లీక్ అయిందని ఆరోపణలు నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు లోనవుతుండగా మంగళవారం వరంగల్లో టెన్త్ హిందీ పేపర్ లీక్ అయ్యింది. ఉదయం 9:30 గంటలకే హిందీ ప్రశ్న పత్రం వాట్సాప్ గ్రూపు లలో ప్రత్యక్షమైంది. ఈ ప్రశ్న పత్రం అన్ని గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది.
దీంతో పరీక్ష సమయంలో ప్రశ్న పత్రం లీక్ అయిందని భావిస్తున్నారు. ఈ కారణంగా టెన్త్ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. లీకుల వార్తలు గుప్పుమంటున్నాయి. వరుస ఈ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారింది.
అసలు పరీక్షల నిర్వహణ సక్రమంగా సాగుతుందా లేదా? ప్రభుత్వం దీనిపై కనీసం దృష్టి పెట్టిందా? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతుండగా, ఈ ప్రభుత్వం చేతగానిదంటూ విపక్షాలు విరుచుకు బడుతున్నాయి.
వరుసగా రెండొ రోజు ప్రశ్న పత్రం లీక్ అవడంతో టెన్త్ పరీక్ష రాసే పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రశ్నాపత్రం SSC స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్లో ప్రత్యక్షం కావడం గమనార్హం. అయితే ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో చూడాలి. ఎక్కడ నుంచి ఈ ప్రశ్నపత్రం లీక్ అయిందని సమాచారం పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
ఈ లీక్ వ్యవహారం మాత్రం సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తుంది. ఈ లీక్ వ్యవహారానికి సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ రంగంలోకి దిగి లీకి వ్యవహారాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. హనుమకొండ జిల్లా కమలాపురం మండలం ఉప్పల్ ప్రాంతం నుంచి ఈ ప్రశ్న పత్రం లీకైనట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ప్రాథమిక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్లు తెలిసింది.