Congress

న్యూఢిల్లీ: మహిళా కోటా బిల్లు బీజేపీ ఎన్నికల ఉత్తుత్తి వాగ్దానమేనని కాంగ్రెస్‌ మండిపడింది. దేశంలోని కోట్లమంది మహిళలు, యువతుల ఆశలకు భారీ ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మహిళా బిల్లు ఎన్నికల జుమ్లా. మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకూ 2021 జనగణను కూడా పూర్తి చేయలేదు. మహిళా కోటా జనగణన తర్వాతే అమల్లోకి వస్తుందని చెబుతున్నది. ఇది కోట్ల మంది మహిళలు, యువతుల ఆశలను వమ్ము చేయడమే’ అని పేర్కొంది.