Rushikonda | అవి టూరిజం భవనాలు.. రుషికొండ లొల్లికి రోజా వివరణ
Rushikonda | విశాఖలో రుషికొండను ధ్వంసం చేస్తూ జగన్ సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. పర్యావరణానికి ఇది విఘాతం అంటూ పవన్ చేసిన ప్రసంగం టివిలో, ఫోన్లలో హడావుడి చేసింది. అయితే దీని మీద ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వాస్తవానికి నిన్న పవన్ చేసిన ఆరోపణలకు వైఎస్సార్ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్లో సమాధానం ఇస్తూ అక్కడ కడుతున్నవి ప్రభుత్వ సచివాలయం భవనాలని పేర్కొంది. అయితే ఆ తరువాత అది నిజం కాదని చెబుతూ పార్టీ ఆ పోస్ట్ […]

Rushikonda |
విశాఖలో రుషికొండను ధ్వంసం చేస్తూ జగన్ సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. పర్యావరణానికి ఇది విఘాతం అంటూ పవన్ చేసిన ప్రసంగం టివిలో, ఫోన్లలో హడావుడి చేసింది. అయితే దీని మీద ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వాస్తవానికి నిన్న పవన్ చేసిన ఆరోపణలకు వైఎస్సార్ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్లో సమాధానం ఇస్తూ అక్కడ కడుతున్నవి ప్రభుత్వ సచివాలయం భవనాలని పేర్కొంది.
అయితే ఆ తరువాత అది నిజం కాదని చెబుతూ పార్టీ ఆ పోస్ట్ తీసేసింది. అయితే అప్పటికే ఆ విషయాన్నీ పట్టుకుంటి టిడిపి సోషల్ మీడియా గోల చేసేసింది. దీంతో రోజా వచ్చి వివరణ ఇచ్చారు. శాఖకు 69 ఎకరాలు భూమి ఉందని, అందులో కేవలం 2.7 ఎకరాల్లో భవనాలు నిర్మిస్తున్నామని వివరించారు.
మా అధికారిక ట్విట్టర్ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణలోకి తీసుకోగలరు.
— YSR Congress Party (@YSRCParty) August 13, 2023
అక్కడ అప్పటికే గతంలో ఎప్పుడో నిర్మించిన హరిత రిసార్ట్స్, ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరడంతో ఇప్పుడు కొత్తవి నిర్మిస్తున్నామని రోజా వివరించారు. జగన్ ఎక్కడ ఉండాలన్నది ప్రభుత్వం చూసుకుంటుందని అన్నారు.
‘‘పవన్ వార్డు మెంబర్ కూడా కాదు.. అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఈనాడులో రాస్తారు, కానీ,టూరిజం మంత్రి చెబితే రాయరు, ఈనాడు జర్నలిజం విలువలు దిగజారిపోయాయి.. చంద్రబాబు, రఘురామ తదితరులు రుషికొండపై కోర్టులో కేసు వేశారు.. కానీ, నిర్మాణాలు ఆపాలని కోర్టు స్టే ఇవ్వలేదు. హైకోర్టు అనుమతితో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు కోర్టుకు ప్రోగ్రెస్ పై అపిడవిట్ సమర్పిస్తున్నాం.
వాస్తవానికి మానవ తప్పిదాలు అనేవి సహజంగానే జరుగుతుంటాయి, అలాగే ఇది కూడా జరిగింది. దానిపై ప్రజలకు తిరిగి వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఒక తప్పిదం జరిగితే అది జరిగింది అని ఒప్పుకుని, దానిని ప్రజలకు వివరించి చెప్పే దమ్ము దైర్యం మాకు ఉంది, కానీ మీలాగా మీ నాయకుడు @ncbn లాగా, ఉన్నది… https://t.co/7lLYRd9SLT
— YSR Congress Party (@YSRCParty) August 13, 2023
ఒకవేళ కోర్టు మార్పులు చేర్పులు సూచిస్తే.. చేస్తాం..ఎన్జీటీ కూడా అనుమతిచ్చింది’’ అన్నారు. విశాఖ బ్రాండ్ ను వారు దెబ్బతీస్తున్నారని, అబద్దాలు చెబితే చంద్రబాబు, పవన్ లను విశాఖ ప్రజలు తన్ని తరిమి కొడతారని అన్నారు.
ఒక రాష్ట్ర మంత్రి చెప్పిన మాటలను ప్రచురించకుండా, ఆ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు ఒక చిన్న ట్వీట్ పట్టుకుని దాన్ని బూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. అసలు వార్తను తప్పుదోవ పట్టించేలా రామోజీ రోత రాతలు రాస్తున్నారు. విశాఖ మీద విషం చిమ్ముతున్నారు. దీన్నిబట్టి విశాఖపై రామోజీకి ఎంత… pic.twitter.com/6nL8RlcVXj
— YSR Congress Party (@YSRCParty) August 13, 2023
టీడీపీకి కావాల్సిన వాళ్లకు నిర్మాణాలు ఇచ్చినపుడు పర్యావరణం దెబ్బతినలేదా? అని పవన్ ను ప్రశ్నించారు రోజా. అఅంతేకాకుండా విశాఖలో కొండమీద రామానాయుడు స్టూడియో ఉంది. హైదరాబాద్ లో చిరంజీవి ఇల్లు కూడా కొండమీదే ఉంది. ఇవన్నీ పర్యావరణానికి విఘాతం కాదా అని రోజా ప్రశ్నించారు.