Bhupalpally | భూపాలపల్లి: పిడుగు పడి ముగ్గురు మృతి

Bhupalpally | విధాత, వరంగల్: జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలో విషాదం నెలకొంది. మంగళవారం కురిసిన వర్షానికి పిడుగు పడి వేర్వేరు ప్రాంతాల్లో రైతు, ఇద్దరు కూలీలు మృతి చెందారు. వివరాలివి. కాటారం మండలం దామెరకుంటలో రైతు రాజేశ్వర్ రావు పొలంలో కలుపు తీస్తున్నాడు. ఈ క్రమంలో పిడుగు పడి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఘటనలో చిట్యాల మండల కైలాపూర్ వద్ద పిడుగుపాటుతో ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. గ్రామానికి చెందిన చెలివేరు సరిత […]

  • Publish Date - September 5, 2023 / 12:15 PM IST

Bhupalpally | విధాత, వరంగల్: జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలో విషాదం నెలకొంది. మంగళవారం కురిసిన వర్షానికి పిడుగు పడి వేర్వేరు ప్రాంతాల్లో రైతు, ఇద్దరు కూలీలు మృతి చెందారు. వివరాలివి. కాటారం మండలం దామెరకుంటలో రైతు రాజేశ్వర్ రావు పొలంలో కలుపు తీస్తున్నాడు. ఈ క్రమంలో పిడుగు పడి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.

మరో ఘటనలో చిట్యాల మండల కైలాపూర్ వద్ద పిడుగుపాటుతో ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. గ్రామానికి చెందిన చెలివేరు సరిత (30), నెరిపటి మమత (32) మిరప నారు పెడుతుండంగా పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఇటీవలే కురిసిన వర్షాలకు జిల్లాలోని మోరంచపల్లి వరదల్లో చిక్కుకొని నలుగురు మృతి చెందిన ఘటన మరువకముందే మరో విషాదం జరిగింది. చాలా రోజుల తర్వాత కురిసిన వర్షంతో సంతోషంలో రైతులుండగా, పిడుగు పడి ముగ్గురు మృతి చెందడంతో జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది

Latest News