• Telugu News
  • /Latest

Train Accident | బాలసోర్ రైలు ప్రమాద ఘటనలో ముగ్గురు ఉద్యోగుల అరెస్టు

Train Accident విధాత: ఒరిస్సా బాలసోర్ రైలు ప్రమాద ఘటనలో ముగ్గురు రైల్వే ఉద్యోగులను సీబీఐ అరెస్టు చేసింది. సీనియర్ ఇంజనీర్ అరుణ్‌కుమార్ మొహంతా, సెక్షన్ ఇంజనీర్ మహమ్మద్ అమీర్ ఖాన్‌, టెక్నిషియన్ పప్పు కుమార్‌లను సీబీఐ అరెస్టు చేసింది. వారిపై హత్య నేరం క్రింద అభియోగాలు మోపింది. 290మంది ప్రయాణికులను బలిగొన్న బాలసోర్ రైలు ప్రమాదంలో గూడ్సు రైలు సహా మరో రెండు ప్రయాణికుల రైళ్లు ఢీ కొన్న ఘటన దేశ రైల్వే చరిత్రలో అతిపెద్ద […]

Reported by: CH RAJITHA | latest | IST
Read Time: 2 mins

Train Accident

విధాత: ఒరిస్సా బాలసోర్ రైలు ప్రమాద ఘటనలో ముగ్గురు రైల్వే ఉద్యోగులను సీబీఐ అరెస్టు చేసింది. సీనియర్ ఇంజనీర్ అరుణ్‌కుమార్ మొహంతా, సెక్షన్ ఇంజనీర్ మహమ్మద్ అమీర్ ఖాన్‌, టెక్నిషియన్ పప్పు కుమార్‌లను సీబీఐ అరెస్టు చేసింది.

వారిపై హత్య నేరం క్రింద అభియోగాలు మోపింది. 290మంది ప్రయాణికులను బలిగొన్న బాలసోర్ రైలు ప్రమాదంలో గూడ్సు రైలు సహా మరో రెండు ప్రయాణికుల రైళ్లు ఢీ కొన్న ఘటన దేశ రైల్వే చరిత్రలో అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది.

ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యామా లేక విద్రోహ చర్యనా అన్నది తేల్చేందుకు సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తుంది.