Yennam Srinivas Reddy

విధాత: సీడబ్ల్యుసీ సమావేశాల సందర్భంగా పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మస్కతి డైరీ చైర్మన్ అలీ మస్కతి, ఖమ్మం కార్పొరేటర్ దొడ్డ నగేశ్‌, జూబ్లిహీల్స్ నియోజకవర్గానికి చెందిన ఉపేందర్ రెడ్డిలు కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఖర్గే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.