విధాత, హైదరాబాద్ : కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై దారుణ హత్యాచారానికి నిరసనగా ఎయిమ్స్ వైద్యులు చేపట్టిన 11రోజుల సమ్మెను గురువారం విరమించారు. సుప్రీంకోర్టు విజ్ఞప్తితో సమ్మెను విరమించుకున్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా, ప్రజాసేవా స్ఫూర్తితో డాక్టర్ల సమ్మెను విరమించినట్లు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్డీఏ) పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై దారుణ హత్యాచారానికి నిరసనగా ఎయిమ్స్ వైద్యులు సమ్మెబాట పట్టగా, ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ గురువారం అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో 11 రోజుల సమ్మెను విరమిస్తున్నట్లు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్డీఏ) తెలిపింది. కోర్టు చర్యను అభినందిస్తున్నామని, కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించినట్లు పేర్కొంది. పేషెంట్ కేర్ తమ మొదటి ప్రాధాన్యత అని వెల్లడించింది.
కాగా, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ సంఘటన, దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది భద్రతకు సంబంధించిన విస్తృత సమస్యను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టుకు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది. సుప్రీంకోర్టు అప్పీల్ మేరకు దేశ ప్రయోజనాల దృష్ట్యా, ప్రజాసేవా స్ఫూర్తితో 11 రోజుల సమ్మెను విరమించుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటనలో పేర్కొంది.
Supreme Court | సుప్రీం కోర్టు విజ్ఞప్తితో ఏయిమ్స్ వైద్యుల సమ్మె విరమణ 11రోజుల సమ్మెకు తెర
కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై దారుణ హత్యాచారానికి నిరసనగా ఎయిమ్స్ వైద్యులు చేపట్టిన 11రోజుల సమ్మెను గురువారం విరమించారు. సుప్రీంకోర్టు విజ్ఞప్తితో సమ్మెను విరమించుకున్నారు

Latest News
Switzerland | భారతీయ పర్యాటకురాలికి స్విట్జర్లాండ్ పోలీసుల షాక్.. టూర్కు వెళ్లొచ్చిన ఏడాదికి రూ.1.5లక్షల ఫైన్ చెల్లించాలని నోటీసులు!
Murder Mystery | కొడుకు కనబడట్లేదని హైకోర్టు మెట్లు ఎక్కిన తల్లి.. సిట్ విచారణలో దృశ్యం మూవీని మించిన ట్విస్టులు!
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా… ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్, స్పెషల్ సాంగ్స్ లాంచ్
జూన్ 12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’
ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదు: ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్
సింధూ లోయ పశుపతి ముద్రపై కొత్త రచ్చ !
కాక్రోచ్ జనతా పార్టీ తొలి టార్గెట్ ధర్మేంధ్ర ప్రధాన్ .. ధర్నాకు పిలుపు
జేబుదొంగలు ఉన్నారు జాగ్రత్త: రాహుల్ గాంధీ హెచ్చరిక
Pooja Hegde | అభిమానిని పట్టించుకోలేదంటూ ట్రోలింగ్.. అసలు నిజం చెప్పిన పూజా హెగ్డే!
విపత్తు నిర్వహణకు రూ.1000 కోట్లు వినియోగించండి : సీఎం రేవంత్ రెడ్డి