పోలీసులకు చిక్కిన కస్టమ్స్ ఉద్యోగి.. 1.4కిలోల బంగారం రికవరీ

చెన్నై విమానాశ్రయంలో పోలీసులు బంగారం మాయం చేసిన ఇంటిదొంగ కస్టమ్స్ ఉద్యోగిని పట్టుకున్నా

  • Publish Date - May 21, 2024 / 04:30 PM IST

విధాత, హైదరాబాద్ : చెన్నై విమానాశ్రయంలో పోలీసులు బంగారం మాయం చేసిన ఇంటిదొంగ కస్టమ్స్ ఉద్యోగిని పట్టుకున్నారు. ఎయిర్‌పోర్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగి మణికందన్ చెన్నై విమానాశ్రయంలో ఫ్లాస్క్ లో 1.4 కిలోల (రూ.92 లక్షలు) బంగారంతో పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి క్యాప్సుల్స్ రూపంలో దాచిన బంగారం రికవరీ చేశారు. ఈ వ్యవహారం చెన్నై విమానాశ్రయం తనిఖీల నాణ్యతను ప్రశ్నార్ధకం చేసింది. దేశంలో ఎక్కువగా బంగారం అక్రమ రవాణా చేస్తూ ఎక్కువగా పట్టుబడుతున్న విమానాశ్రయాల్లో చెన్నై విమానాశ్రయం ఒకటి. ఎయిర్ పోర్టు కాంట్రాక్టు ఉద్యోగి చేతి వాటం నేపథ్యంలో నిఘా కళ్లు గప్పి ఇంకెంత బంగారం రవాణా అవుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Latest News