మోడీ ఓట‌మికై స‌ర్దుకుపోదాం రండి!

కేంద్రంలో బీజేపీ నేతృ­త్వం­లోని మోదీ ప్రభు­త్వాన్ని గద్దె దింప­డమే లక్ష్యంగా ఏర్ప­డిన ఇండియా కూటమి.. అన్నిం­టి­కంటే కీల­క­మైన సీట్ల సర్దు­బా­టుపై దృష్టి

మోడీ ఓట‌మికై స‌ర్దుకుపోదాం రండి!

ఆప్‌తో మొద­లు­పె­ట్టిన కాంగ్రెస్‌ నేతలు

పలు చోట్ల భాగ­స్వా­ము­లవే పెద్ద పార్టీలు

పంజాబ్‌, ఢిల్లీలో కుద­రని పొత్తు!

బెంగాల్‌, యూపీ, కేర­ళ­లోనూ అదే­సీన్‌

పొత్తు లేకున్న గెలు­పుపై పార్టీల ధీమా

మోదీని ఓడిం­చడం తథ్య­మన్న నేతలు

(విధాత ప్రత్యేకం)

కేంద్రంలో బీజేపీ నేతృ­త్వం­లోని మోదీ ప్రభు­త్వాన్ని గద్దె దింప­డమే లక్ష్యంగా ఏర్ప­డిన ఇండియా కూటమి.. అన్నిం­టి­కంటే కీల­క­మైన సీట్ల సర్దు­బా­టుపై దృష్టి కేంద్రీ­క­రిం­చింది. ప్రభుత్వ వ్యతి­రేక ఓటు బ్యాంకు చీలి­పో­కుండా ఉండా­లంటే విపక్ష పార్టీల నుంచి ఒక్కరే అభ్యర్థి ఉండా­లని ఇండియా కూటమి సమా­వే­శాల సంద­ర్భంగా అన్ని­పా­ర్టీలు అంగీ­క­రిం­చాయి. అయితే ఆచ­ర­ణ­లోకి వచ్చే­స­రికి అటు కాంగ్రెస్‌, ఇటు కూట­మి­లోని ఎస్పీ, ఆప్‌, టీఎంసీ, సీపీఎం తమ బెట్టు­వీ­డటం లేదు. అయి­న­ప్ప­టికీ కూట­మి­లోని మిగతా పార్టీ­లతో చర్చలు జర­ప­డా­నికి కాంగ్రె­స్‌­పార్టీ ప్రయ­త్నాలు ప్రారం­భిం­చింది. సీట్ల సర్దు­బాటు ప్రక్రి­యను ఈ నెలా­ఖరు నాటికి పూర్తి చేయా­లని కృత నిశ్చ­యంతో ఉన్నట్టు ఆ పార్టీ నాయ­కులు చెబు­తు­న్నారు.

సొంత ఇంటిని చక్క­ది­ద్దు­కుని

ముందుగా సొంత ఇంటిని చక్క­ది­ద్దు­కునే పనిని కాంగ్రెస్‌ నెల రోజుల కిందటే ప్రారం­భిం­చింది. ఇందులో భాగంగా సీట్ల సర్దు­బా­టుపై ముకుల్‌ వాస్నిక్‌ కన్వీ­న­ర్‌గా రాజ­స్థాన్‌, ఛత్తీ­స్‌­గఢ్‌ మాజీ సీఎంలు అశోక్‌ గెహ్లాట్‌, భూపేశ్‌ బఘేల్‌ తది­తర ఐదు­గురు సభ్యుల బృందం అన్ని­రా­ష్ట్రాల పీసీసీ అధ్య­క్షు­లతో అంత­ర్గ­తంగా చర్చిం­చింది. వారి అభి­ప్రా­యాల నివే­ది­క­లను పార్టీ జాతీయ అధ్య­క్షుడు అధ్య­క్షుడు మల్లి­ఖా­ర్జున ఖర్గే అందిం­చి­నట్లు జాతీయ మీడి­యాలో వార్తలు వస్తు­న్నాయి. మరో­వైపు ఇండియా కూట­మి­లోని పార్టీ­లతో సీట్ల సర్దు­బా­టుపై చర్చలు జరి­పేం­దుకు కాంగ్రెస్ సమా­య­త్త­మ­వు­తోంది.


ఇండియా కూటమి సమా­వేశం సంద­ర్భంగా బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఒక ప్రతి­పా­దన చేస్తూ.. బెంగా­ల్‌లో తాను, పంజాబ్‌, ఢిల్లీలో కేజ్రీ­వాల్‌, యూపీలో అఖి­లేశ్‌ బాధ్య­తలు తీసు­కుం­టా­మ­న్నారు. కానీ పంజా­బ్‌లో ఆప్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర శాఖల నేతలు గెలు­పుపై ఎవ­రికి ధీమాగా ఉన్నారు. ఇక్కడ సీట్ల సర్దు­బాటు అక్క­ర­లే­దని ఇరు పార్టీల నేతలు ఆయా పార్టీల అధి­ష్ఠా­నా­లకు తెలి­పారు. అందుకే ముందు­గానే ఆప్‌తో కాంగ్రెస్‌ పార్టీ చర్చలు మొద­లు­పె­ట్టింది. పంజాబ్, ఢిల్లీలో సీట్ల సర్దు­బా­టుపై ఆమ్ ఆద్మీ పార్టీతో చర్చలు ప్రారం­భ­మై­నట్లు తెలు­స్తోంది. కూట­మిలో పార్టీ­లతో చర్చల జరిపి సమ­స్యను కొలిక్కి తెచ్చే బాధ్య­తను పార్టీ అధ్య­క్షుడు ఖర్గే సీని­యర్ నాయ­కు­లకు అప్ప­గిం­చి­నట్లు హస్తం పార్టీ వర్గాలు తెలి­పాయి.

ఆప్‌, టీఎం­సీ­ల­తోనే సవాళ్లు

ఇండియా కూట­మికి మునుపే బీహా­ర్‌లో ఆర్జేడీ, జేడీయూ, తమి­ళ­నా­డులో డీఎంకే, ఝార్ఖం­డ్‌లో జేఎం­ఎం­లతో కాంగ్రెస్‌ పొత్తు కొన­సా­గి­స్తు­న్నది. కానీ ఉత్త­ర­ప్ర­దే­శ్‌లో ఎస్పీ, కేర­ళ­లో­వా­మ­ప­క్షాలు, బెంగా­ల్‌లో సీపీఎం, టీఎంసీ, పంజాబ్‌, ఢిల్లీలో ఆప్‌తో సీట్ల సర్దు­బా­టుపై కాంగ్రె­స్‌కు సవాళ్లు ఎదు­ర­వు­తు­న్నాయి.

కుద­ర­క­పోతే ప్రత్యా­మ్నాయ మార్గాల అన్వే­షణ

ప్రధా­నంగా బెంగా­ల్‌లో ప్రధాన ప్రత్య­ర్థు­లైన సీపీఎం, టీఎం­సీలు ఇండియా కూట­మిలో ఉన్న­ప్ప­టికీ కలిసి పోటీ­చేసే విష­యంలో విభే­ది­స్తు­న్నాయి. ఫలి­తంగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ సీపీఎం, టీఎం­సీ­లలో ఒక్క పార్టీ­తోనే సర్దు­బాటు చేసు­కునే పరి­స్థితి నెల­కొ­న్నది. ఇటీ­వల టీఎంసీ నాయ­కులు, బెంగాల్‌ పీసీసీ చీఫ్‌ అధీర్‌ రంజన్‌ చౌదరి మధ్య మాటల యుద్ధంతో పార్టీల మధ్య దూరం పెరి­గింది. అలాగే 2019లో లోక్‌­సభ ఎన్ని­కల్లో కేర­ళలో కాంగ్రెస్‌ నేతృ­త్వం­లోని యూడీ­ఎఫ్‌.. 20 స్థానా­లకు 19 గెలు­చు­కు­న్నది. ఆ రాష్ట్రంలో అధి­కా­రంలో ఉన్న సీపీఎం నేతృ­త్వం­లోని ఎల్‌­డీ­ఎఫ్‌ ఒక్క స్థానా­నికే పరి­మి­త­మైంది. అక్కడ సీపీ­ఎంతో సర్దు­బాటు చేసు­కో­వా­లంటే కాంగ్రెస్‌ తన సిట్టింగ్‌ స్థానా­లను త్యాగం చేయాల్సి ఉంటుంది. కేర­ళ­లోనూ కాంగ్రెస్‌ రాష్ట్ర శాఖ సీపీ­ఎంతో సీట్ల సర్దు­బాటు వద్దని అధి­ష్ఠా­నా­నికి తేల్చి చెప్పింది. మోదీ ప్రభు­త్వాన్ని గద్దె దించ­డమే విపక్ష పార్టీల లక్ష్య­మైతే ఆప్‌ అధి­నేత కేజ్రీ­వాల్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా ఇచ్చి­పు­చ్చు­కునే ధోర­ణతో వ్యవ­హ­రి­స్తేనే పంజాబ్‌, ఢిల్లీ, బెంగా­ల్‌లో సీట్ల పంపకం కొలిక్కి వస్తుంది.


ఈ నేప­థ్యం­లోనే చర్చలు ప్రారం­భిం­చిన కాంగ్రెస్‌ పార్టీ వీలై­నంత మేరకు సర్దు­కు­పో­వా­లని యత్ని­స్తు­న్న­దని సమా­చారం. కాంగ్రెస్‌ పార్టీ­ముందు ఇతర ప్రత్యా­మ్నా­యాలు ఉండనే ఉన్నాయి. బెంగా­ల్‌లో మమతా బెనర్జీ తగ్గ­క­పోతే అక్కడ సీపీ­ఎంతో కలిసి సాగే అవ­కా­శా­లు­న్నాయి. కేర­ళలో కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు తీసు­కుని బెంగాల్‌ ఆ పార్టీకి ఎక్కువ సీట్లు ఆఫర్‌ చేస్తుం­ద­నేది వాదన. సీపీఎం దానికి అంగీ­క­రిస్తే కేరళ, బెంగాల్‌, త్రిపుర ఈ మూడు రాష్ట్రాల్లో మెరు­గైన ఫలి­తాలు వస్తా­యని కాంగ్రెస్‌ అధి­ష్ఠానం అంచనా వేస్తు­న్నది. అలాగే యూపీలో ఎస్పీ, ఆర్‌­ఎ­ల్‌­డీతో అవ­గా­హ­నకు రావొచ్చు. జమ్ము­క­శ్మీ­ర్‌లో నేష­నల్‌ కాన్ఫ­రె­న్స్‌తో ఇబ్బంది ఏమీ లేదు. అప్ప­టికీ కూట­మి­లోని కొన్ని­పా­ర్టీలు కలిసి రాక­పోతే మహా­రా­ష్ట్రలో మహా­వి­కాస్‌ అఘాడీ, బీహా­ర్‌లో మహా ఘట్‌­బం­ధన్‌ పార్టీ­లతో సర్దు­బాటు చేసు­కో­వా­ల­ను­కుం­టు­న్నది. జన­వరి చివరి నాటికి లేదా ఫిబ్ర­వరి మొదటి వారం వరకు ఈ ప్రక్రి­యను పూర్తి­చేసి కాంగ్రెస్‌ తన­దైన కార్యా­చ­ర­ణతో ముందుకు వెళ్లడం ఖాయంగా కని­పి­స్తు­న్నది. ఇండియా కూట­మిలో పలు పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్నా­యని, ఇక్కడ పొత్తులు ఉన్నా, లేకున్నా బీజే­పీని ఓడిం­చడం ఖాయ­మని నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తు­న్నారు.