కొత్త చరిత్ర లిఖించబోతున్న భారత పార్లమెంట్: ప్రధాని మోదీ

33% మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్‌తో పార్లమెంట్ కొత్త చరిత్ర సృష్టించబోతోందని ప్రధాని మోదీ తెలిపారు. మహిళా సాధికారితకు ఇది కీలక అడుగు అన్నారు.

న్యూఢిల్లీ : చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచి వారికి రాజకీయ సాధికారికత కల్పించే నారీ శక్తి వందన్ అధినియం ( 33% మహిళా రిజర్వేషన్ బిల్లు)తో పాటు డీలిమిటేషన్ బిల్లుతో భారత పార్లమెంటు సరికొత్త చరిత్రను లిఖించబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అధ్యక్షతన వికసిత్ భారత్ లక్ష్యంతో కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నాం అని, మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. 21వ శతాబ్దం మహిళలకు చెందిందని, ఈ నెల 16న 33% మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ చర్చిస్తుందని స్పష్టం చేశారు.

భారత ప్రజాస్వామ్యాన్ని మహిళలు మరింత బలోపేతం చేస్తారని, సుదీర్ఘ కాలం తర్వాత ఈ బిల్లు వస్తోందని గుర్తు చేశారు. ప్రతి పార్టీ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని..బిల్లు ఆమోదం కోసం సహకరించాలని కోరారు. 2029 నాటికి మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని, పంచాయతీరాజ్ నుంచి పార్లమెంట్ వరకు మహిళల ప్రయాణం సులభం కాబోతుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

పాదయాత్రలో కేటీఆర్ వాస్తవాలు చెప్పాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
Royal Enfield EV bike | ఆధునిక ఫీచర్లతో వింటేజ్ లుక్.. మార్కెట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్!

Latest News