విధాత: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు దుర్మరణం చెందారు.
భైరిసారంగపురంలో ఓ జవాను మృతదేహం అప్పగించి ఏఆర్ కానిస్టేబుళ్లు బొలెరో వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిని క్రాస్ చేస్తుండగా వీరి వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పోలీసుల వాహనం నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మృతుల వివరాలు..
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఏఆర్ ఎస్సై కె.కృష్ణుడు, వై. బాబూరావు (HC), పి. ఆంటోనీ (HC), పి. జనార్దనరావు (డ్రైవర్) ఉన్నట్టు గుర్తించారు.