Warangal: ట్రాక్టర్ ఐడ్రాలిక్‌ ట్రాలీ మధ్యలో చిక్కి రైతు మృతి

  • By: sr    news    Mar 21, 2025 5:41 PM IST
Warangal: ట్రాక్టర్ ఐడ్రాలిక్‌ ట్రాలీ మధ్యలో చిక్కి రైతు మృతి

విధాత, వరంగల్: ట్రాక్టర్ ట్రాలీ మధ్యలో చిక్కి రైతు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామ శివారులో జరిగింది. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

నర్సింహులపేట మండలం దుబ్బతండాకి చెందిన జాటోతు రమేష్ అనే రైతు బొడ్లాడ గ్రామ శివారులో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో వేసిన మొక్క జొన్నకంకులను ట్రాక్టర్ లో తొలుతూ ఆ ట్రాలీని ఒక దగ్గర ఆన్ లోడ్ చేస్తుండగా లేచిన ట్రాలీ కిందకు దిగపోయే సరికి ట్రాలీ కింద ఉన్న జాకీ పైపును లూజు చేయగా ఒక్కసారిగా అతనిపై పడటంతో మృతి చెందారన్నారు.