• Telugu News
  • /News

ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రతా కమిటీ సమావేశం

Reported by: sr | వార్త‌లు | Apr 23, 2025, 8:57 pm IST
Read Time: 1 mins
ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రతా కమిటీ సమావేశం

విధాత: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రతా కమిటీ (CCS) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితర అధికారులు హాజరయ్యారు. పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో జరిగిన ఈ కీలక భేటీలో జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రవాదుల ఏరివేత చర్యలు, సరిహద్దు భద్రతలపై చర్చించారు. సమావేశం వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.