Louis Braille: అంధుల అక్షర శిల్పి.. లూయిస్ బ్రెయిలి గురించి మీకు తెలుసా! అత‌నెలా చ‌నిపోయాడంటే?

  • By: sr |    news |    Published on : Jan 04, 2025 3:56 PM IST
Louis Braille: అంధుల అక్షర శిల్పి.. లూయిస్ బ్రెయిలి గురించి మీకు తెలుసా! అత‌నెలా చ‌నిపోయాడంటే?

Louis Braille

ప్రపంచ చారిత్రక పరిణామ క్రమంలో వికలాంగులపై వివక్ష తారాస్థాయిలోనున్న క్రమంలో వికలాంగులు సమాజంలో దేనికి పనికిరారు, వీరిని పోషించడం సుద్ధదండగా అనే తదితర ఆలోచనలు చరిత్ర కాల గర్భంలోనే కలిసిపోయాయి. విశ్వవ్యాపితంగా ఉన్న అంధులు సైతం తప్పకుండా చదువుకోవాల్సిందేనని, తద్వారా విజ్ఞానం సంపాదించుకొని సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందే అనే ఆశయంతో అందులు గడుపుతున్న చీకటి జీవితాలకు చరమ గీతం పాడిన దీక్షాదక్షుడు. అంధత్వం శరీరానికే కానీ మేధస్సుకు ఏ మాత్రం కాదు, అవకాశాలు ఏవి మన దగ్గరకు రావు వాటిని మనమే సృష్టించుకోవాలి అని అంధత్వంతో బాధపడుతూ కృంగిపోకుండా భావవాదానికి బానిస కాకుండా శాస్త్రీయ దృక్పథంతో కృషిచేస్తే మనుషులు ఋషులు అవుతారు మహా పురుషులవుతారనే మాటలను కవి 18వ శతాబ్దంలో అంధుల జీవితాల్లో చీకటి చరిత్ర తలరాతను మార్చేసిన లూయీస్ బ్రెయిలీని ఉద్దేశించి రాసాడేమోననిపిస్తుంది.

ప్రపంచంలోని అంధులందరికి అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన శాస్త్రీయ వాది మేధావి అయిన లూయిస్ బ్రెయిలీ ఫ్రాన్స్ దేశంలో పారిస్ నగరానికి 20 మైళ్ళ దూరంలోనున్న మారుమూలలో నున్నటువంటి రాని క్రూవె గ్రామంలో మౌనిక్ సైమన్ దంపతులకు జనవరి 4, 1809లో జన్మించారు. దారిద్య్ర రేఖకు మైళ్ళ దూరంలోనన్న నిరుపేద కుటుంబం, మౌనిక్ సైమన్ దంపతులకు ముగ్గురు సంతానంలో చివరి వాడే లూయీస్ బ్రెయిలీ (Louis Braille). మౌనిక్ సైమన్ దంపతులు వృత్తిరీత్యా చర్మకారులు, లెదర్ ఉపయోగించి జీన్లు, రకాల సామాగ్రి తయారుచేసి చుట్టుపక్క ఊళ్లల్లో అమ్ముకుంటూ పోషణ సాగించేవారు. లూయీస్ బ్రెయిలీ చాలా చురుకైన వాడు. మూడు సంవత్సరాల వయసున్నప్పుడే వాళ్ళ అన్న పుస్తకాలు చదివేవాడు. తన తండ్రితో ఒక రోజు గుర్రుపు జీన్లు తయారుచేసుకునే వాళ్ళ షాపుకు వెళ్ళాడు. అక్కడున్న పదునైన చువ్వ, కత్తులతో తండ్రిని అనుకరిస్తున్నాడు. తండ్రి కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈసారి మాత్రం పదునైన కత్తి నాన్నను అనుకరిస్తూ ఉన్న క్రమంలోనే ఎగిరి వచ్చి ఒక కంటిలో గుచ్చుకుంది. స్థానిక హాస్పిటల్లో వైద్యునికి తల్లిదండ్రులు చూపించారు. బీదరికం కారణంగా మంచి వైద్యం అందిచంలేకపోవడంతో కంటిచూపు మొత్తం పోయింది. మొదట ప్రమాదానికి గురైన కన్ను కొంత కాలానికే ఇన్ఫెక్షన్ అయి రెండవ కంటిచూపు తన 5వ ఏట పూర్తిగా కోల్పోయి అంధత్వానికి దారితీసింది. అందరిలాగానే తన కొడుకు చదువుకోవాలనే ఆశయంతో మౌనిక్ సైమన్ దంపతులు లూయీస్ బ్రెయిలిని అక్క అన్నతో పాటుగా వారి గ్రామంలో నున్న పాఠశాలకు పంపించారు. ఆ పాఠశాలలో లూయీస్ బ్రెయిలీ కనబరిచిన అద్భుత ప్రతిభను గమనించిన తన తండ్రీ చెక్కుపై మేకుల అక్షరాల రూపంలో బిగించి వాటిని తాకడం ద్వారా లూయీస్ బ్రెయిలీకి అక్షర జ్ఞానం కలిగించాడు. చదువుకోవాలనే పట్టుదలను తన తెలివితేటల్ని చూసి ఉపాధ్యాయులే ఆశ్చర్యానికి లోనయ్యేవారు.

ప్రపంచంలో మొదటగా 1784లో వాలంటీన్ హవే చేత ప్రారంభం అయిన అంధుల పాఠశాలలో పుస్తకాలు అన్ని కాగితంపై మేకులతో ఉబ్బెత్తుగా చేసి అంధులు తడిమడం ద్వారా గుర్తుపట్టేట్లు చేసి విద్యాబోధన చేసేవారు. ఈ పుస్తకాలు పెద్దగా బరువుగా ఖరీదైనవిగా ఉండడంవల్ల వీటి ద్వారా విద్యాభ్యాసం సాధ్యపడేది కాదు. దీనితో సంతృప్తి చెందనటువంటి లూయీస్ బ్రెయిలీ 1821లో చార్లెస్ బార్ బెరియన్ అను సైన్యాధికారి రూపొందించినటువంటి పాఠశాలలో రహస్య డీకోడ్ భాష ద్వారా సైనికులకు 12 చుక్కలతో మాత్రమే శిక్షణను ఇచ్చేవాడు. బార్ బెరియన్ పాఠశాలలో చేరి 12 చుక్కల లిపితో కొంత కాలం చదువుకొనసాగింది. దానితో సంతృప్తి చెందకుండా దానిపై అనేక పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. దాదాపు 11 సంవత్సరాల పరిశోధనల అనంతరం 1832లో అభివృద్ధి చెందిన సరళ పద్దతిలో చుక్కల లిపిని కనుగొన్నాడు. ఈ లిపికి బ్రెయిలి పేరు మీదగానే నామకరణం చేయడం మూలంగా బ్రేయిలి లిపి అని పేరు వచ్చింది.

లూయిస్ బ్రెయిలి మేధాశక్తికి బహుమతిగా నేషనల్ స్కూల్ ఫర్ ది బ్లెండ్ నందు ప్రొఫెసర్ పోస్టుకు 1833లో ఎంపికయ్యారు. లూయీస్ బ్రెయిలీ విద్యార్థులకు హిస్టరి, ఆల్వబ్రా, చరిత్ర పాఠ్యాంశాలు బోధించేవారు. 1831లో 6 చుక్కల లిపిని కనుగొన్నప్పటికి కూడా ప్రశాంతంగా ఉండకుండా నిరంతరం శ్రమిస్తూ 1839లో సున్నితమైన సులభతరమైన డెకాపాయింట్ అను కొత్త పద్ధతిని ఉపయోగించి పేపరుపై రంధ్రాలు సులభంగా చేసే పద్దతిని కనిపెట్టి బ్రెయిలీ లిపిని అభివృద్ధి పరిచాడు. లూయీస్ మంచి సంగీత విద్వాంసుడు. ఇతను 1834 ° 1839 వరకు ఫ్రాన్స్ దేశంలోనున్న చర్చిల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చేవాడు. వాలంటీస్ హలే చనిపోయిన తర్వాత అనంతరం వచ్చిన అంధల పాఠశాల ప్రిన్సిపల్గా వచ్చినటువంటి డాక్టర్ అలెండర్ ప్రాన్సిస్ లూయీస్ ను చరిత్ర పుస్తకాన్ని మొత్తం బ్రెయిలి లిపిలోకి అనువాదం చేసినందుకు తన ఉద్యోగం నుండి తీసేసాడు.

లూయీస్ బ్రెయిలీ కనిపెట్టిన లిపి ప్రస్తుతమున్న కంప్యూటర్ భాషకు వీలుగా రూపొందించబడిందంటేనే లూయీస్ బ్రెయిలీ ముందు చూపు ఎంతో అర్థమవుతుంది. బ్రెయిలి లిపి కనుగొనబడిన తర్వాత సమాచార రంగంలో అంధులకు విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. లూయీస్ బ్రెయిలి చనిపోయిన తర్వాత తన గొప్పతనాన్ని గుర్తించిన ప్రపంచ దేశాలు తన పేరు మీద పోస్టల్ స్టాంపులు, కరెన్సీ విద్యా సంస్థలకు, పట్టణాలకు పేర్లను పెట్టుకుంటున్నాయి. మన దేశంలో రెండు రూపాయల కాయిను, యుఎస్పి ఒక డాలరును, ఫ్రాన్స్, జర్మనీ ప్రపంచ వ్యాపితంగా చెల్లుబాటయ్యే పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. మానసిక సామర్థ్యానికి వైకల్యం అడ్డుకాదని ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చునని అంధుడై అంధుల కోసం ప్రస్తుతం ఉన్నా కంప్యూటర్ పరిజ్ఞానానికి అనుకూలంగా చిన్ననాటి నుంచి అనారోగ్యం సమస్యలతో బాధ పడుతున్న లూయీస్ ను ట్యుబరీక్యులోస్ అను మహమ్మారి వ్యాధి పట్టిపీడించడంతో 1852లో తన సొంత గ్రామం అయిన క్రూవెలో ప్రాణాలు విడిచాడు. లూయీస్ బ్రెయిలీ చనిపోయిన రెండు సంవత్సరాల అనంతరం లిపి ప్రాచుర్యంలోకి వచ్చింది. యూరప్ 1873 అనంతరం లిపి విస్తరించింది. యుఎస్ఎల్లో 1883లో ఈ లిపిని వాడడం ప్రారంభించారు. విశ్వవ్యాప్తంగా ఇంగ్లీషు భాషలోకి లిపిని 1932లో ప్రవేశపెట్టారు. ఎంతో మంది అంధ వికలాంగులను విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, పత్రికాధిపతులుగా, సంగీత కళాకారులుగా, చిత్రకారులుగా అనేక రంగాల్లో బ్రెయిలి లిపితో అగ్రభాగాన నిలిచేట్లు చేసిన లూయిస్ బ్రెయిలీ అంధుల అక్షర ప్రధాతగా ఎన్నటికి వెలుగొందుతూనే ఉంటాడు.

 

(జనవరి 4, లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా)

P.Rajasheker, All India Genaral Secretary, Union Bank of India Differently Abled Employees Federation [UBIDEF],

Med, Ma[Telugu], UGC-NET[TELUGU], Ph-9490098018, mail-ubidefallindia@gmail.com