Site icon vidhaatha

Karnataka: షాకింగ్‌.. కర్ణాటక మాజీ డీజీపీ హత్య! భార్యపైనే అనుమానం?

Karnataka |

విధాత: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ బెంగళూర్‌లోని తన ఇంట్లో శవంగా కనిపించాడు. అతడి ఒంటిపై పలు చోట్ల కత్తితో పొడిచిన గాయాలు ఉన్నాయని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఓం ప్రకాశ్ తన ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. అతడి భార్య పల్లవి ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లోని వారి నివాసంలో పల్లవి, ఓం ప్రకాశ్ ని హత్య చేసినట్లు తెలుస్తోంది.

డీజీజీ మృతి సంచలనంగా మారింది. మృతుడి భార్య పల్లవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబంలో నెలకొన్న ఆర్థిక సమస్యల నేపథ్యమే హత్యకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఓం ప్రకాశ్ భారీగా రుణాలు తీసుకున్నాడని, తన ఆస్తిని భార్యకు కాకుండా నేరుగా కొడుకుకు బదిలీ చేశారని.. దీనిపై నెలకొన్న వివాదాలు ఓం ప్రకాశ్ హత్యకు దారితీశాయా లేక మరేదైనా కారణం ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఓం ప్రకాష్ స్వస్థలం బీహార్ రాష్ట్రంలోని చంపారన్. కర్ణాటక కేడర్‌ 1981 బ్యాచ్ ఐపీఎస్ ఓం ప్రకాశ్ బళ్లారిలోని హరసనహళ్లీలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. శివమొగ్గ, ఉత్తర కన్నడ, చిక్క మంగళూర్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. ఆయన తన సర్వీసులో కర్ణాటక విజిలెన్స్ సెల్ ఎస్పీ, లోకాయుక్తలో, అగ్నిమాపక సేవల డీఐజీ, సీఐడీ ఐజీ వంటి కీలక పదవులను నిర్వహించారు. 1993 భత్కర్ మత అల్లర్ల అదుపులో ఆయన కీలక పాత్ర పోషించారు. 2015లో డీజీపీ అండ్ ఐజీపీగా బాధ్యతలు స్వీకరించి.. 2017లో పదవీ విరమణ చేశారు.

Exit mobile version