Solar Project: అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు అభివృద్ధిలో ముందడుగు

ముంబై: మహీంద్రా గ్రూప్లో భాగమైన స్వరాజ్ ట్రాక్టర్స్, పంజాబ్లో అతిపెద్ద సోలార్ గ్రూప్ క్యాప్టివ్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేసేందుకు మహీంద్రా సస్టెన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బటిండా జిల్లాలో నిర్మించే 26 మెగావాట్ల సౌరశక్తి ప్లాంట్, స్వరాజ్ ట్రాక్టర్స్ వినియోగిస్తున్న పునరుత్పాదక ఇంధనాన్ని 50 శాతం పెంచే దిశగా కీలక ముందడుగు. మహీంద్రా సస్టెన్ అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్ట్, మొహాలి, డేరా బస్సీలోని నాలుగు స్వరాజ్ ట్రాక్టర్ తయారీ యూనిట్లకు శుద్ధమైన విద్యుత్ను సరఫరా చేస్తుంది. సంవత్సరానికి సుమారు 60 మిలియన్ kWh సౌరశక్తి ఉత్పత్తి చేయనున్న ఈ ప్లాంట్, 54,600 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు దోహదం చేయనుంది.
ఈ సందర్భంగా మహీంద్రా అగ్రి పరికరాల విభాగం అధ్యక్షుడు హేమంత్ సిక్కా మాట్లాడుతూ.. “భారత్లో ట్రాక్టర్ తయారీలో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని విస్తృతం చేయడానికి మరో మార్గమే ఇది. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడంతో పాటు స్థిరమైన భవిష్యత్తు లక్ష్యంగా మేము ముందుకు సాగుతున్నాం.” అని పేర్కొన్నారు. స్వరాజ్ డివిజన్ CEO గగంజోత్ సింగ్ మాట్లాడుతూ.. “పరిశుభ్రమైన శక్తిని వినియోగించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. మహీంద్రా సస్టెన్ సహకారంతో పంజాబ్లో పునరుత్పాదక ఇంధన వనరులను సమృద్ధిగా అందించగలుగుతామని విశ్వసిస్తున్నాం.” అని అన్నారు. మహీంద్రా సస్టెన్ మేనేజింగ్ డైరెక్టర్, CEO దీపక్ ఠాకూర్ మాట్లాడుతూ.. “వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు శుభ్రమైన ఇంధన పరిష్కారాలు అందించడమే మా లక్ష్యం. స్వరాజ్ ట్రాక్టర్స్తో కలిసి పంజాబ్లో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేయడం గర్వంగా ఉంది.”