మంగళగిరి సిఐడి కార్యాలయంలో.. మాజీమంత్రి దేవినేని ఉమా

దేవినేని ఉమామహేశ్వర రావు కామెంట్స్… హై కోర్టు ఆదేశాలను గౌరవించి మంగళగిరి సీబీఐ ఆఫీస్ కి రావడం జరిగింది.కరోనా విలయతాండవం చేస్తుంది.ప్రజలు ఫోన్ లు చేసి ఒక్క బెడ్ ఇప్పించండి అని ప్రాధ్యాపడుతున్నారు.బందరు లో మంత్రి చాలా పెద్డ పెద్డ కబుర్లు చెప్పాడు.అధికారులు, పోలీసులు కేసులంటూ తిరుగుతున్నారు ప్రజలను పట్టించుకునే వాళ్ళు లేరు. ముఖ్యమంత్రి కి కరోనా భయం రెండు గంటలు క్యాబినెట్ మిటింగ్ కూర్చుంటే కరోనా వస్తుందేమో అని భయం.. మీకే అలా ఉంటే విద్యార్థుల […]

మంగళగిరి సిఐడి కార్యాలయంలో..  మాజీమంత్రి దేవినేని ఉమా

దేవినేని ఉమామహేశ్వర రావు కామెంట్స్…

హై కోర్టు ఆదేశాలను గౌరవించి మంగళగిరి సీబీఐ ఆఫీస్ కి రావడం జరిగింది.కరోనా విలయతాండవం చేస్తుంది.ప్రజలు ఫోన్ లు చేసి ఒక్క బెడ్ ఇప్పించండి అని ప్రాధ్యాపడుతున్నారు.బందరు లో మంత్రి చాలా పెద్డ పెద్డ కబుర్లు చెప్పాడు.అధికారులు, పోలీసులు కేసులంటూ తిరుగుతున్నారు ప్రజలను పట్టించుకునే వాళ్ళు లేరు.

ముఖ్యమంత్రి కి కరోనా భయం

రెండు గంటలు క్యాబినెట్ మిటింగ్ కూర్చుంటే కరోనా వస్తుందేమో అని భయం.. మీకే అలా ఉంటే విద్యార్థుల పరిస్థితి ఏమిటి?కేంద్ర సంస్థల కంటే నువ్వు ఏమైనా తెలివిగాలవాడివా?ధూళిపాళ నరేంద్ర చేసిన తప్పేమిటండీ?గుజరాత్ అమూల్ కి పాలు పోయించాలని తాపత్రయం పడుతున్నాడు.

దొంగల పేరుతో నోటీసులు ఇస్తారా..?

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ భావన ప్రకటన హక్కు కు ఏ మాత్రం గౌరవం లేదు.చట్టాలను చుట్టలుగా చేసుకొని పరిపాలన చేస్తున్నారు.ఒకే బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పడుకున్నారు.ముఖ్యమంత్రి ని నేను ఒక్కటే అడుగుతున్నా.. కరోనా హాస్పిటల్ ను సందర్శించే దమ్ము ఉందా ?.కుటుంబాన్ని కాపాడుకోడానికి ఏ విధంగా తాపత్రయ పడుతున్నారో చూడండి.

ఆక్సిజన్ ఇచ్చే దిక్కు కూడా లేదు

కరోనా ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి దాదాపు మూడు నెలల సమయం ఉంటే ఏమి చేశారు?మమ్మల్ని కేసులు పెట్టి పోలీసు స్టేషన్ చుట్టు తిప్పి ఒక పైశాచిక ఆనందం పొందుతున్నావు.ప్రజావేధిక తో మొదలైన నీ విధ్వంసం వైజాగ్ పల్లా శ్రీనివాస రావు దగ్గరకు వచ్చింది.భారత రాజ్యాంగం పట్ల నాకు సంపూర్ణ నమ్మకం ఉంది న్యాయం జరుగుతుంది.

వ్యాక్సిన్ ఎంత మందికి చేశారు?

రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మందికి ఇంకా సెకండ్ వ్యాక్సిన్ వేయయించుకోలేదు.మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా దేవినేని ఉమా బ్రతికునంతా వరకు ప్రశ్నిస్తూనే ఉంటాడు.