సినిమా వాళ్లే కాదు క్రికెటర్స్ అన్నా కూడా మనోళ్లు పడి చచ్చిపోతుంటారు. తమ అభిమాన ఆటగాళ్లని కలిసేందుకు నానా తంటాలు పడుతుంటారు. మ్యాచ్లు జరిగేటప్పుడు పటిష్టమైన భద్రతా వలయాలని కూడా దాటుకొని వచ్చి మరీ షేక్ హ్యాండ్లు, పాదాభివందనాలు, హగ్లు ఇస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు
Dhoni| సినిమా వాళ్లే కాదు క్రికెటర్స్ అన్నా కూడా మనోళ్లు పడి చచ్చిపోతుంటారు. తమ అభిమాన ఆటగాళ్లని కలిసేందుకు నానా తంటాలు పడుతుంటారు. మ్యాచ్లు జరిగేటప్పుడు పటిష్టమైన భద్రతా వలయాలని కూడా దాటుకొని వచ్చి మరీ షేక్ హ్యాండ్లు, పాదాభివందనాలు, హగ్లు ఇస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు చాలానే చూశాం. ఐపీఎల్లో కూడా చాలానే జరుగుతున్నాయి. రోహిత్ శర్మ కోసం ఓ అభిమాని, విరాట్ కోహ్లీని కలిసేందుకు ఒకడు, ధోని కోసం మరొకడు ఇలా గ్రౌండ్లోకి వచ్చి మరీ రచ్చ చేశారు.
విరాట్ కోహ్లీని కలవడానికి వచ్చిన అభిమానిని సెక్యూరిటీ పక్కకు తీసుకెళ్లి పిచ్చి కొట్టుడు కొట్టడంకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఇక రీసెంట్గా ముగిసిన గుజరాత్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో మహేంద్రసింగ్ ధోనిని కలవాలని ఓ వీరాభిమాని పోలీసుల భద్రతని దాటుకొని గ్రౌండ్లోకి దూసుకొచ్చాడు. అయితే ఆ సమయంలో ధోనిని దగ్గరగా చూసిన ఆ అభిమాని పాదాభివందంనం చేసి హగ్ కూడా చేసుకున్నాడు. ఇంతలో భద్రతా సిబ్బంది అక్కడికి వచ్చి ఆ కుర్రాడిని తీసుకుని వెళ్లారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
అయితే అతడి పేరు జయ్ కుమార్ జానీ కాగా, అతను భావ్ నగర్ జిల్లాకు చెందిన రబారిక గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు తెలియజేశారు. ప్రస్తుతం అతను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడట. ధోని అంటే విపరీతమైన ఇష్టం ఉన్న అతను ఎలాగైన ధోనిని కలవాలని అనుకున్నాడు. అందుకే ఆ ఛాన్స్ మిస్ చేసుకోవద్దని అలా గ్రౌండ్లోకి వచ్చాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఐపీసీ 447 సెక్షన్ ప్రకారం అతడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలియజేశారు. ఇప్పుడు అతడిపై కేసు నమోదు అయితే మాత్రం చదువుకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగ అవకాశాల సమయంలో లేని పోని సమస్యలు ఎదురు కావచ్చు. ప్రస్తుతానికి అయితే నరకం చూస్తున్నాడనే చెప్పాలి