IND vs WI 2nd Test | రెండో టెస్టులో గెలుపు దిశగా భారత్ : దీటుగా పోరాడిన వెస్టిండీస్
వెస్ట్ఇండీస్పై రెండో టెస్ట్లో భారత్ విజయానికి కేవలం 58 పరుగులు మాత్రమే అవసరం ఉంది. కుల్దీప్, బుమ్రా, సిరాజ్ బౌలింగ్తో ప్రత్యర్థిని 390 పరుగులకు కట్టడి చేసింది.

India 58 runs away from 2–0 sweep of West Indies | IND vs WI Test 2025
IND vs WI Test | వెస్టిండీస్పై రెండో టెస్ట్లో భారత్ విజయానికి చేరువలో ఉంది. మొదటి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించిన భారత్, వెస్టిండీస్ను ఫాలోఆన్కు దింపింది. కానీ వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో నిబ్బరంగా ఆడింది. పిచ్ మందకొడిగా మారడంతో భారత్కు వికెట్లు లభించడం కష్టంగా మారింది. ఫాలోఆన్లోనే మళ్లీ ఆలౌట్ చేసి మరోసారి ఇన్నింగ్ విజయం సాధించాలన్న కల నెరవేరలేదు. ఇద్దరు వెస్టిండీస్ బ్యాటర్లు సెంచరీలు చేయడంతో 390 పరుగులకు ఆలౌట్ అయి, 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 63 పరుగులు చేసి, విజయానికి 58 పరుగుల దూరంలో ఉంది. సాయిసుదర్శన్ (30*), కేఎల్ రాహుల్ (25*) క్రీజులో ఉన్నారు.
వెస్ట్ఇండీస్ ధీటైన పోరాటం
అంతకుముందు ఫాలోఆన్కు దిగిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో మంచి ప్రతిఘటన ప్రదర్శించింది. జాన్ క్యాంప్బెల్ (115), షై హోప్ (103) శతకాలు చేసి జట్టును నిలబెట్టారు. చివరి వికెట్ జంట 79 పరుగులు చేయడంతో ఆలౌట్ ఆలస్యమైంది.
అయితే బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ త్రయం సమర్థంగా బౌలింగ్ చేసి ఇన్నింగ్స్ను ముగించారు. సిరాజ్ హోప్ వికెట్ తీసి బ్రేక్ ఇవ్వగా, కుల్దీప్ వరుసగా మూడు వికెట్లు తీశాడు. బుమ్రా కూడా చివరి దశలో కీలకంగా బౌలింగ్ చేసాడు. కుల్దీప్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి ఎనిమిది వికెట్లు సాధించి ప్రధాన వికెట్ టేకర్గా నిలిచాడు.
ఆఖరి రోజుకు వాయిదా పడ్డ విజయం
భారత్కి ఇప్పుడు కేవలం 58 పరుగులు మాత్రమే అవసరం ఉంది. పిచ్ నిస్సారంగా ఉన్నా, బ్యాటర్లు రేపు పెద్దగా ఇబ్బంది పడకుండానే ఆటను తొందరగా ముగిస్తారని అంచనా. ఈ విజయంతో భారత్ సిరీస్ను 2–0 తేడాతో గెలుచుకోనుంది.