కాన్పూర్​ స్టేడియం స్టాండ్ బలహీనం–పూర్తిగా నిండితే కూలిపోయే అవకాశం

భారత్​ – బంగ్లాదేశ్​ల మధ్య జరగాల్సిన రెండో టెస్ట్​ వేదికైన కాన్పూర్​ స్టేడియంలోని స్టాండ్స్​ నిర్మాణాలు చాలా బలహీనంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కాన్పూర్​ స్టేడియం స్టాండ్ బలహీనం–పూర్తిగా నిండితే కూలిపోయే అవకాశం

కాన్పూర్(Kanpur)​లోని గ్రీన్​ పార్క్​ స్టేడియం(Green Park Stadium). 27 నుండి భారత్​ – బంగ్లాదేశ్​(India – Bangladesh)ల మధ్య జరగాల్సిన రెండోది, ఆఖరిది అయిన టెస్ట్​ మ్యాచ్​(2nd Test Match) వేదిక. ఇప్పుడు టెన్షన్​ అంతా అక్కడికే చేరుకుంది. ఈ టెస్ట్​ను కూడా కొట్టేసి, సిరీస్​ను క్లీన్​ స్వీప్​ చేయాలని భారత్​ కసిగా ఉంటే, గెలిచి పరువు నిలుపుకుందామని బంగ్లాల ప్రయత్నం. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, మ్యాచ్​ జరగాల్సిన స్టేడియమే భయపెడుతోంది. 2021 తర్వాత జరుగబోయే మొదటి అంతర్జాతీయ మ్యాచ్​(first international match after 2021) ఇది. స్టేడియంలోని బాల్కనీ సి స్టాండు (Weak Stand) బలహీనంగా ఉందని ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వ​ ప్రజా పనుల శాఖ(UP PWD) బాంబు పేల్చింది. ఒకవేళ స్టేడియం పూర్తిగా నిండితే నిర్మాణం కూలిపోయే(Collapse) ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

యుపిసిఏ సిఈఓ(UPCA CEO) అంకిత్​ చటర్జీ(Ankit Chatterjee) ఈ విషయాన్ని ధృవీకరించారు. పిడబ్ల్యూడి వారు తమకు ఈ సంగతి తెలిపినట్లు, తాము కూడా ఆ స్టాండ్​లో పూర్తి టికెట్లు అమ్మడం లేదని ఆయన తెలిపారు. మొత్తం 4800 టికెట్లకు గానూ కేవలం 1700 మాత్రమే అమ్మకానికి పెట్టినట్లు చెప్పిన అంకిత్​, స్టాండ్​ రిపేర్​ పనులు ఇంకో రెండు రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్​ ప్రజాపనుల శాఖ ఇంజనీర్లు స్టేడియంను అత్యంత నిశితంగా పరిశీలించి ప్రమాదం పొంచిఉందని, ఆ స్టాండ్​ను వాడకూడదని యుపిసిఏకు తెలియజేసారు.

ఆ స్టాండ్​ కనీసం 50 మంది అభిమానులను కూడా తట్టుకోలేదని, ఒకవేళ పంత్​ గనుక ఓ సిక్స్​ కొడితే(If Pant hits a Six..), వారి గెంతులకు స్టాండ్​ కూలిపోవడం ఖాయమని వారు కుండ బద్దలు కొట్టారు. ఓ పక్క యుపిసిఏ ఆ స్టాండ్​కు సంబంధించిన 1700 టికెట్లు అమ్మాకానికి పెట్టింది.

స్టాండ్​ రిపేర్​ పనులు శరవేగంగా కొనసాగుతున్నప్పటికీ, మ్యాచ్​ నాటికల్లా పూర్తవకపోతే పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు అందరినీ భయపెడుతోంది.