హైదరాబాద్, సెప్టెంబర్ 20:
iPhone 17 in Hyderabad | ఆపిల్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్ విక్రయాలు హైదరాబాద్లో నిన్న ప్రారంభమయ్యాయి. పంజాగుట్టలోని సమీర్ కమ్యూనికేషన్స్ షోరూమ్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, యజమాని సమీర్ మొహమ్మద్ ప్రీబుక్ చేసిన కస్టమర్లకు తొలి ఫోన్లు అందజేశారు.
దుకాణంలో పండుగ వాతావరణం నెలకొంది. కొత్త ఐఫోన్ను అందుకుంటున్న కస్టమర్లు ఆనందంతో సెల్ఫీలు తీసుకుంటూ, కొత్త మోడల్ ఫీచర్లను పరిశీలించారు. సమీర్ మొహమ్మద్ మాట్లాడుతూ, “హైదరాబాద్లో ఐఫోన్ 17 సిరీస్ను మా కస్టమర్లకు మొదటగా అందించడం మాకు ఆనందంగా ఉంది. స్పందన అద్భుతంగా ఉంది,” అన్నారు. స్మార్ట్ఫోన్ ప్రియులు, టెక్ బ్లాగర్లు, యువ కస్టమర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. “ఆపిల్ ప్రతి సారి కొత్త ప్రమాణాలను సెట్ చేస్తోంది. ఐఫోన్ 17 నిజంగా గేమ్-చేంజర్” అని ఒక యువ కొనుగోలుదారు పేర్కొన్నారు.
పంజాగుట్ట సమీర్ కమ్యూనికేషన్స్లో యజమాని సమీర్ మొహమ్మద్ ప్రీబుక్ కస్టమర్లకు తొలి ఫోన్లు అందజేశారు.
హైదరాబాద్లోని రిటైలర్ల వద్ద ఐఫోన్ 17 మోడల్స్కి భారీగా డిమాండ్ ఉంది. ప్రో మాక్స్ వెర్షన్లు గంటల్లోనే పూర్తిగా సేల్ అవ్వడం గమనార్హం.