Telangana | జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. పలు అంశాలపై కీలక నిర్ణయం

వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ గురువారం సమావేశమైంది. సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు

Telangana | జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. పలు అంశాలపై కీలక నిర్ణయం

విధాత, హైదరాబాద్ : వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ గురువారం సమావేశమైంది. సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది. సమావేశంలో స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోని భార్య, భర్త చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూల నిర్ణయం తీసుకుంది.

కేబినెట్‌ సబ్ కమిటీకి చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖల అధిపతులకు పంపించాల్సిందిగా జీఏడీ అధికారులకు సబ్‌ కమిటీ ఆదేశించింది. మిగతా దరఖాస్తులను వివిధ శాఖలకు పంపి వాటిని పరిశీలన చేసిన అనంతరం తిరిగి కేబినెట్‌ సబ్ కమిటీ దృష్టికి తీసుకురావాలని కమిటీ సమావేశంలో నిర్ణయించింది. కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు, రిటైర్డ్ ఐఏఎస్‌ శివశంకర్‌, జీఏడీ అధికారులు పాల్గొన్నారు.