విధాత: బ్యాంకుల్లో నకిలీ ధ్రువపత్రాలు పెట్టి రూ.3 కోట్లకుపైగా అప్పు తీసుకుంటే సీబీఐ విచారణకు వెళ్లాలని ఎస్బీఐ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అంతకంటే తక్కువుంటే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. అందులో భాగంగా నారాయణపేట జిల్లాలోని ఊట్కూరు, మక్తల్, మాగనూరు, కృష్ణా, నర్వ మండలాల పరిధిలో 2018 కంటే ముందు అప్పు తీసుకొని బకాయి ఉన్నవారి వివరాలను సేకరించారు. వారు సమర్పించిన పత్రాలు అసలువా లేక నకిలీవా.. అని తెలుసు కోవడానికి బ్యాంకర్లు మండలాల వారీగా తహసీల్దార్లకు లేఖలు రాయగా వారు పరిశీలిస్తున్నారు. ఊట్కూరు ఎస్బీఐ ద్వారానే 300 మందికి సంబంధించిన ధ్రువపత్రాలను ఎమ్మార్వోలకు అందించారు. మిగతా మండలాల్లోనూ వీటిపై లోతుగా అధ్యయనం చేయడానికి బ్యాంకర్లు రెవెన్యూ శాఖ సాయం తీసుకుంటున్నారు.
నకిలీ పాసుపుస్తకాలు, ఫోర్జరీ సంతకాల ముఠాపై కలెక్టర్ హరిచందన ఆరా తీశారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి వివరాలు తెలపాలని స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో రెవెన్యూ అధికారులు నకిలీ ధ్రువపత్రాల ముఠాపై విచారణ చేపడుతున్నారు. ఈ కుంభకోణంలో రూ.3 కోట్ల మేర అవకతవకలు జరిగితే మాత్రం సీబీఐ విచారణ చేపట్టే అవకాశాలుండడంతో అక్రమార్కుల వెన్నులో వనుకు మొదలైంది.
బ్యాంకుల్లో లోన్ రూ.3 కోట్లు దాటితే సీబీఐ విచారణ
<p>విధాత: బ్యాంకుల్లో నకిలీ ధ్రువపత్రాలు పెట్టి రూ.3 కోట్లకుపైగా అప్పు తీసుకుంటే సీబీఐ విచారణకు వెళ్లాలని ఎస్బీఐ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అంతకంటే తక్కువుంటే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. అందులో భాగంగా నారాయణపేట జిల్లాలోని ఊట్కూరు, మక్తల్, మాగనూరు, కృష్ణా, నర్వ మండలాల పరిధిలో 2018 కంటే ముందు అప్పు తీసుకొని బకాయి ఉన్నవారి వివరాలను సేకరించారు. వారు సమర్పించిన పత్రాలు అసలువా లేక నకిలీవా.. అని తెలుసు కోవడానికి బ్యాంకర్లు […]</p>
Latest News

పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం
సభ్యులకు ఉద్దేశాలు ఆపాదిస్తారా? ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల నోటీసు
కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు