జర్నలిస్టుల సమస్యలకు శాశ్వత పరిష్కారం…జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి

సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు జర్నలిస్టులు, జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే, ఆరోగ్య భద్రత, అక్రిడిటేషన్ కార్డుల విషయంలో పాలసీని రూపొందించండి, గత పదేళ్లుగా ఏపాలసీ లేని తెలంగాణ, మీడియా అకాడమీకి రూ.10 కోట్లు, హైదరాబాద్ లో పని చేసే అర్హులైన జర్నలిస్టులందరినీ ఫోర్త్ సిటీలో భాగస్వామ్యం చేస్తాం,జర్నలిస్టులకు 38 ఎకరాల స్థలాన్ని అప్పగింత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

జర్నలిస్టుల సమస్యలకు శాశ్వత పరిష్కారం…జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
  • సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు జర్నలిస్టులు
  • జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే
  • ఆరోగ్య భద్రత, అక్రిడిటేషన్ కార్డుల విషయంలో పాలసీని రూపొందించండి
  • గత పదేళ్లుగా ఏపాలసీ లేని తెలంగాణ
  • మీడియా అకాడమీకి రూ.10 కోట్లు
  • హైదరాబాద్ లో పని చేసే అర్హులైన జర్నలిస్టులందరినీ ఫోర్త్ సిటీలో భాగస్వామ్యం చేస్తాం
  • జర్నలిస్టులకు 38 ఎకరాల స్థలాన్ని అప్పగింత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జర్నలిజం కూడా వ్యవస్థలో ఒక భాగమే అన్న ఆయన జర్నలిస్టుల సూచనలు, ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఆదివారం రవీంధ్ర భారతి లో సమచార పౌర సంబంధాల శాఖ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ లకు కేటాయించిన పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోరుతూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆనాడు వైఎస్ఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి శశబిషలు లేవని రేవంత్ స్పష్టం చేశారు. మీ సమస్యకు మా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని తెలిపారు.


వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరు.. అది మనకు మనమే పెంచుకోవాలని రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు సూచించారు. ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే మా ప్రభుత్వ విధానమన్నారు. జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమేనని రేవంత్ స్పష్టం చేశారు. ఆనాడు రాజాకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవన్నారు. కానీ ఈరోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయని తన బాధను వ్యక్తం చేశారు. కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోందన్నారు. కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారన్నారు. అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీపైనే ఉందని తెలిపారు. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిదన్నారు. భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యతనిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దన్నారు. నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు.

ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా కాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత మేం తీసుకుంటామన్నారు.
తెలంగాణకు టూరిజం, ఎనర్జీ, స్పోర్ట్స్ పాలసీలు లేవన్న రేవంత్ రెడ్డి గత పదేళ్లుగా తెలంగాణకు అసలు పాలసీలే లేవని ఎద్దేవా చేశారు. మేం మీలో ఒకరమే… మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాదేనన్నారు. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నుంచి రూ.10కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని రేవంత్ రెడ్డి తెలిపారు. అర్హులైన జర్నలిస్టుల దరినీ ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మనందరం భాగస్వాములమవుదామని రేవంత్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఐజే యూ జాతీయ నాయకులు దేవులపల్లి అమర్, జవహర్ లాల్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు బొమ్మగాని కిరణ్ కుమార్, సీఈఓ వంశీ, డైరెక్టర్లు రవికాంత్ రెడ్డి, రమణారావు, అశోక్ రెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్ హన్మంతరావు, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.