విధాత : బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతించింది. రెండు రోజుల క్రితం కవిత అనారోగ్యానికి గురికావడంతో హుటాహుటిన ధీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు. సాయంత్రానికి జ్వరం తగ్గడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ క్రమంలో కవిత తరఫున న్యాయవాదులు కోర్టును ఆశ్రయించడంతో ఎమ్మెల్సీ కవిత వైద్య పరీక్షలకు కోర్టు అనుమతించింది. ఢిల్లీ ఎయిమ్స్ లో కవితకు వైద్య పరీక్షలు చేయాలని అదేశాలు జారీ చేసింది. అలాగే.. వైద్య పరీక్షల అనంతరం ఆమె ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను కోర్టుకు అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో పాటుగా కవిత జ్యుడీషియల్ కస్టడీ ఈ నెల 22 వరకు పొడిగిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మార్చి 16న అరెస్టు కాగా అప్పటి నుంచి జైలులోనే ఉంటున్నారు.
KAVITHA | కవిత వైద్య పరీక్షలకు కోర్టు అనుమతి .. కస్టడీ 22వరకు పొడిగింపు
బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతించింది. రెండు రోజుల క్రితం కవిత అనారోగ్యానికి గురికావడంతో హుటాహుటిన ధీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు