విధాత : బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతించింది. రెండు రోజుల క్రితం కవిత అనారోగ్యానికి గురికావడంతో హుటాహుటిన ధీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు. సాయంత్రానికి జ్వరం తగ్గడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ క్రమంలో కవిత తరఫున న్యాయవాదులు కోర్టును ఆశ్రయించడంతో ఎమ్మెల్సీ కవిత వైద్య పరీక్షలకు కోర్టు అనుమతించింది. ఢిల్లీ ఎయిమ్స్ లో కవితకు వైద్య పరీక్షలు చేయాలని అదేశాలు జారీ చేసింది. అలాగే.. వైద్య పరీక్షల అనంతరం ఆమె ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను కోర్టుకు అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో పాటుగా కవిత జ్యుడీషియల్ కస్టడీ ఈ నెల 22 వరకు పొడిగిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మార్చి 16న అరెస్టు కాగా అప్పటి నుంచి జైలులోనే ఉంటున్నారు.
KAVITHA | కవిత వైద్య పరీక్షలకు కోర్టు అనుమతి .. కస్టడీ 22వరకు పొడిగింపు
బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతించింది. రెండు రోజుల క్రితం కవిత అనారోగ్యానికి గురికావడంతో హుటాహుటిన ధీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు

Latest News
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు
అమ్మ పేరుతో మొక్కలు నాటండి: పవన్ కల్యాణ్