దేశంలో రైతు భూమికి గ్యారెంటీ ఇచ్చే నాయకులు, పార్టీలు కరువయ్యాయి. సంస్కరణల పేరుతో రైతుల చేతుల్లో నుంచి భూములను కొట్టేసే కుట్రలు చేస్తున్నాయి. రైతుల భూములకు భరోసా, భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలు కార్పోరేట్ సంస్థల చేతుల్లోకి అలవోకగా వెల్లే విధంగా విధానాలు రూపొందిస్తున్నాయి.
కుర్చీ కోసం జరిగే కొట్లాటలో బలవుతున్న రైతు
సంస్కరణల పేరుతో రైతుల భూములు లక్కునే కుట్రలు
వివాదాల పరిష్కారానికి వ్యవస్ధలు లేకుండా చేస్తున్న వైనం
యుపీఏ హయాంలో రూపుదిద్దుకున్న టైటిల్ గ్యారెంటీ ముసాయిదాకు ఆమోదం తెలిపిన అన్ని పక్షాలు
రాష్ట్రాలలో అమలుకు ససేమిరా అంటున్న పార్టీలు
తాజాగా ఏపీలో ఈ చట్టాన్ని రద్దు చేయడంతో దేశంలో మిగతా రాష్ట్రాలు ముందుకు వచ్చేనా?
తెలంగాణ అడుగు ముందుకా… వెనక్కా
విధాత: దేశంలో రైతు భూమికి గ్యారెంటీ ఇచ్చే నాయకులు, పార్టీలు కరువయ్యాయి. సంస్కరణల పేరుతో రైతుల చేతుల్లో నుంచి భూములను కొట్టేసే కుట్రలు చేస్తున్నాయి. రైతుల భూములకు భరోసా, భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలు కార్పోరేట్ సంస్థల చేతుల్లోకి అలవోకగా వెల్లే విధంగా విధానాలు రూపొందిస్తున్నాయి. ఫలితంగా ఏ ఒక్క చిన్న వివాదం తలెత్తినా సామాన్య రైతులకు కోర్టుకు మినహా మరెక్కడా వివాదం పరిష్కరించుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా భూవివాదాలు తలెత్తితే పరిష్కరించడానికి గ్రామీణ స్థాయి నుంచి మండల, డివిజనల్, జిల్లా వరకు ఉన్న అధికార వ్యవస్థను లేకుండా చేస్తున్నారు. అధికారులకు ఉన్న అధికారాలను తీసివేస్తున్నారు. సామాన్య రైతులను కోర్టు మెట్లు ఎక్కమంటున్నారు. ఫలితంగా రైతులకు మేలు చేససే చట్టాలు కూడా పరిష్కార వ్యవస్థ సరిగ్గా లేక పోవడంతో అవి ప్రజలకు ప్రతిబంధకంగా మారుతున్నాయి.
2010లో రైతుల భూములకు భద్రత కల్పించే విధంగా నాటి యుపీఏ సర్కారు రూపొందించిన ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వాలు యధావిధిగా అమలు చేయడానికి ముందుకు రావడం లేదు. పైగా టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చే యడానికి ముందుకు వచ్చినా రాష్ట్రాలు కూడా రైతులకు గ్రీవెన్స్ లేకుండా చేసింది. ఫలితంగా ఈ చట్టం రైతులకు ప్రమాద కారి అని ప్రతిపక్షం ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందింది కానీ దీనిని సవరించి రైతుల భూములకు గ్యారెంటీ కల్పించే బదులు ఏకంగా చట్టాన్నే రద్దు చేసింది.
రాజకీయ లబ్ది కోసం
రాజకీయ ఆదితప్యం కోసం రాజకీయ పార్టులు టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని ఒక భూతంలా చూపెట్టి రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఫలితంగా రైతుల భూములకు సంపూర్ణ హక్కులు కల్పించే ఈ చట్టానికి పురిట్లోనే ఉరి వేస్తున్నాయి. రైతే రాజు అన్న పదం కేవలం నాయకుల నినాదాలకే పరిమితం అవుతోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు అవుతున్నా రైతు పట్టా భూమికి గ్యారెంటీ లేదు. ప్రభుత్వాలు కేవలం భూమి రికార్డులకు కాపలాదారుడిగానే ఉంటున్నాయి, కానీ గ్యారెంటీ దారుడిగా మాత్రం ఉండడానికి ఇష్ట పడడం లేదు. పైగా దేశంలో ఏదైనా ఒక రాజకీయ పక్షం టైటిల్ గ్యారెంటీకి వెళుతుంటే మిగతా పక్షాలు దానిని భూతద్దంలో చూపించి వ్యతిరేకిస్తున్నాయి. ఫలితంగా దేశంలో ఈ చట్టానికి అమలులోకి తీసుకురావడానికి ఏ రాజకీయ పార్టీ కూడా సాహసం చేయలేక పోతున్నాయి. యుపీఏ ప్రభుత్వం 2010లో లాండ్ టైటిల్ ముసాయిదా బిల్లును రూపొందించింది. నాడు అన్ని రాజకీయ పార్టీలు ఈ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపాయి. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ ముసాయిదా బిల్లును ఆయా రాష్ట్రాలలో అమలు చేయడానికి ముందుకు రావడం లేదు. తాజాగా రాజకీయ ఆదితపత్య పోరులో వైసీపీ తీసుకు వచ్చిన లాండ్ టైటిల్ చట్టాన్నితాజాగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల్లో ఈ అంశాన్నే ప్రధాన నినాదంగా తీసుకోవడం కొసమెరుపు. కుర్చీ కోసం జరిగిన కొట్లాటలో చివరకు రైతే బలయ్యాడు. అయితే తాను బలవుతున్నాననే విషయాన్ని రైతు గ్రహించక ముందే జరగాల్సిన నష్టం జరుగుతోంది.
మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే
దేశం ఆర్థికంగా అభివృద్ది కావాలంటే భూవివాదాలు ఉండకూడదు. రైతు భూమి కి గ్యారెంటీ ఉండాలి. ఇందుకు ప్రభుత్వాలే ముందుకు రావాలి. కానీ రాజకీయ పార్టీల నేతలు గ్యారెంటీ అనే పదాన్ని కేవలం నినాదానికే పరిమితం చేశారు కానీ వాస్తవ రూపం తీసుకురావడానికి ముందుకు రావడం లేదు. 2010లో మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నంచారు. ఈ మేరకు అన్ని రాజకీయ పక్షాలతో సమావేశాలు నిర్వహించారు. అందరి ఆమోదంతో ముసాయి బిల్లు రూపుదిద్దుకున్నది. భూమి పరిపాలన అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం కావడం చేత ఆనాడు కేంద్రం రాష్ట్రాలకు ముసాయి బిల్లును పంపించి అమలు చేసుకోవాలని తెలిపింది. అలాగే సమగ్ర భూ సర్వే నిర్వహించడానికి కూడా రాష్ట్రాలకు భారీ ఎత్తున నిధులు విడుదల చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ కూడా బిల్లుపై ఎలాంటి పేచీలు పెట్టకుండా అమలు చేసుకోమని తెలిపింది. ఇలా దేశమంతటా భూమి హక్కులకు హామీ ఇచ్చే చట్టం కావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సమయంలోనే హక్కుకు హామీ ఇచ్చే చట్టాన్ని భూములు లాక్కునే చట్టం అనే ముద్ర వేసి అమలులోకి రాకముందే రద్దు చేశారు. పురిట్లోనే ఈ చట్టాన్ని చిదిమేశారని వ్యవసాయ రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.