ఈనాడు (Eenadu)సంస్థల అధిపతి రామోజీరావు(Ramoji Rao)ను తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హాస్పిటల్లో చేర్పించారు
ఈనాడు (Eenadu)సంస్థల అధిపతి రామోజీరావు(Ramoji Rao)ను తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హాస్పిటల్లో చేర్పించారు. ఆయన మైల్డ్ హార్ట్ ఎటాక్(Heart Attack)కు గురైనట్లు గుర్తించిన వైద్యులు స్టంట్ వేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేసాయి. ఆయనకు ఎటువంటి వెంటిలేటర్ సహాయం అవసరం పడలేదని వారు తెలిపారు.
ఈనాడు పత్రిక అధినేత, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు (87) తీవ్ర అస్వస్థతలో ఆసుపత్రిలో చేరారు. అకస్మాత్తుగా అయన ఇంట్లో తీవ్రంగా ఇబ్బంది పడటం గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని స్ఠార్ హాస్పిటల్ చేర్పించారు. అక్కడ ఆయనకు చిన్నగా గుండెపోటు వచ్చిందని తెలుసుకున్న వైద్యులు స్టెంట్ వేసారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉన్నా, నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు వెంటిలేటర్పై చికిత్సనందిస్తున్నట్లుగా నెట్లో వైరల్ అవుతున్న వార్త అవాస్తవమని ఆసుపత్రివర్గాలు తోసిపుచ్చాయి. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న రామోజీరావు వృద్ధాప్య సమస్యలతో కూడా సతమతమవుతున్నారు. మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీ విషయంలో గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబించిన కక్షపూరిత వైఖరి కూడా ఆయన మనస్థాపానికి కారణమైనట్లు భావిస్తున్నారు.