Fish prasadam | ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. రేపు, ఎల్లుండి హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది.
Fish prasadam : ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. రేపు, ఎల్లుండి హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా సమస్య, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ల కోసం బత్తిన కుటుంబీకులు చేపమందు పంపిణీ చేస్తున్నారు.
వారు ఈ చేప మందును ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ మందు కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలిరానున్నారు. ఈసారి కూడా మూడు రోజుల ముందే ప్రజలు భారీ సంఖ్యలో ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకున్నారు. చేప ప్రసాదానికి భారీగా డిమాండ్ ఉండంతో నిర్వాహకులు స్థానికులకు పలు సూచనలు చేశారు.
చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని బత్తిన కుటుంబీకులు తెలిపారు. చేప మందు కోసం వచ్చే ప్రజల కోసం టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. రెండు రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మార్గంలో 130 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది.
ప్రధాన రైల్వే స్టేషన్లు అయిన సికింద్రాబాద్, కాచిగూడ నుంచి.. ప్రధాన బస్టాండ్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీ కల్పిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.