మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మరోసారి తనదైన శైలీలో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
మాజీ మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్
విధాత, హైదరాబాద్ : మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మరోసారి తనదైన శైలీలో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్గా మారాయి. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మల్లారెడ్డిలు ఓ పెళ్లి వేడుకలో పరస్పరం ఎదురుపడ్డారు. ఈటలను చూసిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన వద్దకు వెళ్లి నువ్వే గెలుస్తున్నవన్నా అంటూ అలింగనం చేసుకున్నారు. ఫోటో తీయండయ్య అన్నతోటి అంటూ ఉత్సాహంగా పోటోలు దిగారు. ఈటల వెంట ఉన్న నాయకులను పలకరించి వారిని అభినందించారు.
రాజకీయాల్లో అనేక మాటలు మాట్లాడుకుంటామని అవన్ని వస్తుంటాయ్ పోతుంటాయ్ అని మల్లారెడ్డి వ్యాఖ్యానిస్తు ఆల్ది బెస్ట్ చెప్పి అక్కడి నుంచి ముందుకు కదిలారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో వైరల్గా మారింది. మల్కాజిగిరిలో బీఆరెస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి పట్నం సునితామహేందర్రెడ్డి బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతున్న తరుణంలో బీఆరెస్కు చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి తమ ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటలనే గెలుస్తున్నారంటూ చెప్పడం హాట్ టాపిక్గా మారింది.