బీఆరెస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. వారి ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లలో హైకోర్టు నోటీసులు
అఫిడవిట్ల వివాదంలో విచారణ
విధాత, హైదరాబాద్ : బీఆరెస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. వారి ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లలో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తప్పుడు వివరాలతో మల్లారెడ్డి అఫిడవిట్ సమర్పించారని కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ పిటిషన్ వేశారు. మల్లారెడ్డి ఎన్నికల సమయంలో తన అఫిడవిట్లో సూరారం గ్రామంలో కొంత భూమి ఉందని పేర్కొనగా.. రికార్డుల ప్రకారం అది గవర్నమెంట్ ల్యాండ్ అని పిటిషనర్ పేర్కొన్నారు. మల్లారెడ్డి తన అఫిడవిట్లో బ్యాంకు ఖాతాలు లేవని తెలిపారని.. బ్యాంకు ఖాతాలు లేకుండా ఐటీ ఎలా దాఖలు చేస్తున్నారో వివరాలు వెల్లడించలేదని తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ ఆయన ప్రత్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మల్లారెడ్డి, పల్లా కేసుల విచారణ మునుముందు ఆసక్తికరంగా సాగనుందని విశ్లేషకులు చెబుతున్నారు.