హైదరాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ తరపున కే మాధవీలత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తుల విలువ రూ. 218.38 కోట్లు. ఇక రూ. 27 కోట్లు అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లో మాధవీలత పేర్కొన్నారు
హైదరాబాద్ : హైదరాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ తరపున కే మాధవీలత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తుల విలువ రూ. 218.38 కోట్లు. ఇక రూ. 27 కోట్లు అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లో మాధవీలత పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి చెందిన విరించి హాస్పిటల్ విలువ రూ. 94.44 కోట్లు కాగా, ఇందులో మాధవీలత షేర్లు రూ. 2.94 కోట్లు. చరాస్తుల విలువ రూ. 165.46 కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ రూ. 55.92 కోట్లు అని పేర్కొన్నారు. ఇక పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసినట్లు తెలిపారు. మాధవీలతపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
అసదుద్దీన్ ఒవైసీ ఆస్తులు రూ. 23.87 కోట్లు
ఇదే హైదరాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆస్తుల విలువ రూ. 23.87 కోట్లు మాత్రమే. రూ. 7 కోట్ల అప్పులు ఉన్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. లండన్లో ఎల్ఎల్బీ డిగ్రీ చేసినట్లు తెలిపారు. ఐదు క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు. ఇక తన వద్ద ఒక రైఫిల్, పిస్తోల్ ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు.