Rains | అధికారుల‌కు సెల‌వులు ర‌ద్దు.. ఎందుకంటే..?

Rains | రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revant Reddy) అల‌ర్ట్ అయ్యారు. అధికారుల‌తో అత్యవసర సమీక్ష నిర్వ‌హించారు. అలాగే సీనియర్ మంత్రులు భట్టి విక్ర‌మార్క‌, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వ‌ర్ రావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుతో ఫోన్‌లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Rains | అధికారుల‌కు సెల‌వులు ర‌ద్దు.. ఎందుకంటే..?

Rains | రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revant Reddy) అల‌ర్ట్ అయ్యారు. అధికారుల‌తో అత్యవసర సమీక్ష నిర్వ‌హించారు. అలాగే సీనియర్ మంత్రులు భట్టి విక్ర‌మార్క‌, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వ‌ర్ రావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుతో ఫోన్‌లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో జ‌న జీవ‌నం అత‌లాకుత‌ల‌మైంది. వ‌ర‌ద నీరు పోటెత్తింది. దీంతో సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. అధికారులు సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకొని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని సీఎం స్ప‌ష్టం చేశారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలో అంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఏంఓ(CMO) కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.

వరద ఎఫెక్ట్ ఏరియాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర పనులుంటే తప్ప‌ ప్రజలు బయటకి రావొద్దని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా అంటూ ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 24 గంటలు అలెర్ట్‌గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగంగా కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సీఏం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.