విధాత: చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ టిడిపి కార్యకర్తలు శనివారం హైదరాబాద్ మెట్రో రైల్ లో జై బాబు.. బాబుతో మేము మనము అంటూ నినాదాలతో రచ్చ చేశారు. మియాపూర్ నుండి ఎల్బీనగర్ వెళ్తున్న మెట్రో రైల్లో గుంపులుగా ఎక్కిన టిడిపి కార్యకర్తలు నినాదాలతో తమ నిరసన తెలియజేశారు.
చంద్రబాబు నాయుడు అరెస్టు పై హైదరాబాద్ మెట్రోలో హంగామా సృష్టించిన టీడీపీ కార్యకర్తలు pic.twitter.com/iN9orsk4KV
— Telugu Scribe (@TeluguScribe) October 14, 2023
అయితే తోటి ప్రయాణికులకు ఇది ఇబ్బందికరంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు మియాపూర్ మెట్రో స్టేషన్లు టిడిపి కార్యకర్తలను ట్రైన్ నుండి బయటకి దించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కారణంగా రైలు దాదాపు గంటపాటు ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.