విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనం సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకమని సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్య మంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.
అనంతరం మాట్లాడుతూ, ఈ పథకంతో స్కూల్స్లో డ్రాప్ ఔట్స్ తగ్గించి, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పునకు నాంది పలకనుందని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలో 67,255 మంది విద్యార్థులకు, ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 48 వేల 408 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందన్నారు.
వెయ్యి గురుకులాలు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. సీఎం బ్రేక్ఫాస్ట్ విద్యార్థుల కడుపు నింపడమే కాదు , పనులకు వెళ్లే లక్షలాదిమంది తల్లులకు ఆసరా అని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల, కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ ప్రియాంక, డీఈఓ అశోక్, మున్సిపల్ చైర్ పర్సన్ పరిమాల అన్నపూర్ణమ్మ, కమిషనర్ రామానుజుల రెడ్డి, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ పాల్గొన్నారు.