బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్ ఫోన్ టాంపరింగ్ లో సిని హిరోయిన్లను బెదిరింపులకు పాల్పడ్డారని, త్వరలో కేసీఆర్ శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయే అవకాశం ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు
బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్ ఫోన్ టాంపరింగ్ లో సిని హిరోయిన్లను బెదిరింపులకు పాల్పడ్డారని, త్వరలో కేసీఆర్ శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయే అవకాశం ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు
కేసీఆర్ త్వరలో జైలు ఊచలు లెక్కిస్తారు
రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
విధాత, వరంగల్ ప్రతినిధి: బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్ ఫోన్ టాంపరింగ్ లో సిని హిరోయిన్లను బెదిరింపులకు పాల్పడ్డారని, త్వరలో కేసీఆర్ శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయే అవకాశం ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి కేసీఆర్ ఫాంహౌస్ ను విడిచి వచ్చాడని, కొత్త డ్రామాకు తెర తీశారని విమర్శించారు. సోమవారం వరంగల్లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. అధికారం కోల్పొవడం తో కేసీఆర్ కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ని విమర్శించే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. కేసీఆర్ పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలైందని విమర్శించారు. కేసీఆర్ బిడ్డ కవిత మద్యం కేసులో జైలులో ఉందనే విషయం మరిచిపోయారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా వారికి ఆర్థిక సహాయం చేయలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేశామన్నారు. రైతులకు రాయితీలను ఎత్తివేసి రైతు భీమా ఇచ్చారన్నారు. ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి.. రాష్ట్రంను అప్పులపాలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో విద్యుత్ సంస్థలు అప్పులపాలైయ్యాయని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటమి తప్పదని హెచ్చరించారు.
తమ మానసపుత్రికగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు మీ పాలనలో దెబ్బతిందన్నారు. దెబ్బతిన్న రెండు ప్రాజెక్టుల రూపకల్పన చేసింది ఈ గొప్ప ఇంజనీర్ కేసీఆర్ గదా? అంటూ ఎద్దేవా చేశారు. నిర్మాణ లోపంతోనే కాళేశ్వరం దెబ్బతిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ త్వరలో కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేటీఆర్ మాట తీరు మార్చుకోవాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్, కాంగ్రెస్ పార్టీలో చేరిన డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.