హరిత భవనాల కొనుగోలుపై చైతన్యం పెంచాలి: మంత్రి శ్రీధర్‌బాబు

నిర్మాణ రంగంలో పెరుగుతున్న కాలుష్య నివారణకు దీర్ఘకాలిక వ్యూహాలతో ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ప్రతి పౌరుడు లబ్ది పొందేలా తమ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు ఉంటాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు

హరిత భవనాల కొనుగోలుపై చైతన్యం పెంచాలి: మంత్రి శ్రీధర్‌బాబు

నిర్మాణ రంగంలో కాలుష్య నివారణ చర్యలు

విధాత: నిర్మాణ రంగంలో పెరుగుతున్న కాలుష్య నివారణకు దీర్ఘకాలిక వ్యూహాలతో ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ప్రతి పౌరుడు లబ్ది పొందేలా తమ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు ఉంటాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. నగరంలోని హైటెక్స్‌ గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షోను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 40 శాతం విద్యుత్తును నిర్మాణ రంగంలో వినియోగిస్తున్నారని, కర్బన ఉద్గారాలు సైతం వెలువడుతున్నాయన్నారు.

నిర్మాణ రంగంలో హరిత భవనాలు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. హరిత భవనాల గురించి కొనుగోలుదారులకు నిర్మాణ సంస్థలు అవగాహన కల్పించాలని, 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వీటి నిర్మాణం ప్రారంభమైందని చెప్పారు. ప్లాస్టిక్ వినియోగంపై కేంద్రంలోని అప్పటి మన్మోహన్‌ సింగ్‌ సర్కారు కఠిన చట్టాలను తీసుకొచ్చిందని తెలిపారు. గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఆకస్మిక తనిఖీలు చేశానని, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం ఐటీ రంగంలో రూ. వేలకోట్ల పెట్టుబడులు వస్తున్నాయయని, దీనివల్ల ఉద్యోగాలతో పాటు పరోక్షంగా ఎన్నో అవకాశాలు లభిస్తాయన్నారు. సులభతర వాణిజ్య విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెట్టుబడిదారులు, నిర్మాణ సంస్థలు, స్థిరాస్తి రంగానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.