పద్నాలుగేళ్లు అలుపెరగని ఉద్యమాలతో ఢిల్లీ పెద్దల మెడలు వచ్చి తెలంగాణ సాధించిన బీఆరెస్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతోందని మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు
మరో ఉద్యమానికి బీఆరెస్ శ్రీకారం
విధాత: పద్నాలుగేళ్లు అలుపెరగని ఉద్యమాలతో ఢిల్లీ పెద్దల మెడలు వచ్చి తెలంగాణ సాధించిన బీఆరెస్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతోందని మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. బీఆరెస్ 24వ అవిర్భావ దినోత్సవాన్ని నల్లగొండ బీఆరెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్, నల్గొండ ఎంపీ అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త తిప్పన విజయసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భాస్కర్ రావులతో కలిసి ఘనంగా నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మోసపూరిత 420 హామీలతో అధికారంలోకి వచ్చి , ప్రజల గోసకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ప్రజల పక్షాన బీఆరెస్ పోరాడుతూనే ఉంటుందన్నారు.తొమ్మిదిన్నరేళ్ల బీఆరెస్ పాలనలో అద్భుతంగా నిర్మించబడ్డ తెలంగాణను కాంగ్రెస్ సర్కార్ మూడు నెలల్లోనే కుప్పకూల్చిందన్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ నిజ జీవితంలో ఏనాడు నిజాలు పలకరని, అలాంటి పొద్దుతిరుగుడు పుష్పాల గురించి మాట్లాడి నా నాలుకను మైల పరుచుకోలేనని జగదీష్రెడ్డి సెటైర్లు వేశారు.