Mulugu |
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రక్తాన్ని దానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణం కాపాడడమంటే మానవాళికి సేవ చేసినట్లేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కిసాన్ కాంగ్రెస్ సెల్ ఆధ్వర్యములో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ శనివారం జరిగిన మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ
1200 మంది ప్రాణ త్యాగాలను చూసి చలించిన శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే వచ్చిన తెలంగాణ లో కెసిఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ కు రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పడం ఖాయమని, రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన యవుసం బాగు పడ్డ చరిత్ర లేదన్నారు.
అమ్మ పోతే అడవి కొనబోతే కొరివి అన్నట్లు ఉంది రైతుల పరిస్థితి ఉందన్నారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్య మంత్రి కెసిఆర్ రైతు ఆత్మ హత్యాల్లో దేశం లోనే రెండవ స్థానం లో ఉన్నామని సీతక్క అన్నారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేకం
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రైతు వ్యతిరేక ప్రభుత్వాలని సీతక్క విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల సమయంలో ఏక కాలంలో రైతు రుణమాఫీ చేస్తామని మాయమాటలు చెప్పి అధికారం లోకి రాగానే విస్మరించారని అన్నారు. కె
సిఆర్ గడిచిన తొమ్మిదిన్నర యేండ్ల నుండి రుణమాఫీ చేయలేదని రైతు రుణమాఫీ లేదు, పంట నష్ట పరిహారం లేదు, పండించిన పంటలను కొనడం లేదు, పండించిన పంట కు గిట్టు బాటు ధర లేదు,
ఇన్ ఫుడ్ సబ్సిడీ లేదు, కల్తీ ఎరువులు, పురుగు మందులు, కల్తీ విత్తనాలు ఇలా అనేక విధాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్లు వ్యహరిస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
గడిచిన తొమ్మిదిన్నర యేండ్ల కాలంలో ఆత్మ హత్యలు చేసుకున్న రైతులను అదుకున్న పాపాన పోలేదు, ఆత్మ హత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం రావాలంటే రైతును రాజును చేయాలంటే కాంగ్రెస్ అధికారం లోకి రావాలనన్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సుమారు 80 మంది రక్త దానం చేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చి మెగా రక్త దానం శిబిరం విజయవంతం చేసిన రైతులకు, కాంగ్రెస్ పార్టీ కార్య కర్తలకు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ జగదీష్ తో పాటు హాస్పిటల్ సిబ్బంది, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.