Nagarjuna Sagar | తెరుచుకున్న నాగార్జు సాగర్ క్రస్ట్‌ గేట్లు.. దిగువకు కృష్ణమ్మ పరవళ్లు

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను అధికారులు సోమవారం 11గంటలకు తెరిచి దిగువకు నీటి విడుదల ప్రారంభించారు. ముందుగా 2గేట్లను, తర్వాతా ఆరుగేట్లను తెరిచారు.

Nagarjuna Sagar | తెరుచుకున్న నాగార్జు సాగర్ క్రస్ట్‌ గేట్లు.. దిగువకు కృష్ణమ్మ పరవళ్లు

6గేట్లతో నీటి విడుదల..సాయంత్రం 14గేట్లను ఎత్తాలని నిర్ణయం

విధాత, హైదరాబాద్ : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను అధికారులు సోమవారం 11గంటలకు తెరిచి దిగువకు నీటి విడుదల ప్రారంభించారు. ముందుగా 2గేట్లను, తర్వాతా ఆరుగేట్లను తెరిచారు. సాయంత్రం కల్లా14గేట్లను 5ఫీట్ల మేరకు ఎత్తి దిగువకు నీటి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నాగేశ్వర్ రావు క్రస్ట్‌గేట్ల స్విచ్ ఆన్ చేసి గేట్లు తెరిచారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి పూజలు నిర్వహించారు.

ప్రస్తుసతం 312టీఎంసీల పూర్తి స్థాయి నీటి మట్టంకుగాను 288టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 590అడుగులకుగాను 581.2అడుగుల నీటి నిల్వ కొనసాగుతుంది. ఇన్ ఫ్లో 3.75లక్షలుగా ఉండగా, క్రస్ట్‌గేట్ల ద్వారా సోమవారం లక్షన్నర క్యూసెక్కుల నీటిని దిగువకు వదలనున్నారు. సాగర్ జలాశయం క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్న నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలను, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. దిగువన ఉన్న పులిచింతల, విజయవాడ బ్యారేజీకి కృష్ణానది పరవళ్లు కొనసాగుతున్నాయి.