Ponnam Prabhakar : తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.806.35 రాయితీ
తెలంగాణలో ఈవీ పాలసీ ద్వారా 1,59,304 వాహనాలకు రూ.806.35 కోట్ల రాయితీ ఇచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈవీ పాలసీ మేరకు ఇప్పటిదాక 1లక్ష 59,304 ఈవీ వాహనాలకు రూ.806.35 కోట్ల రూపాయల రాయితీని ఇవ్వడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈవీ వాహనాలకు రాయితీ కారణంగా ప్రభుత్వం రూ.806 కోట్ల రూపాయలు టాక్స్ నష్టపోయినప్పటికీ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించడానికి తోడ్పడిందని పొన్నం తెలిపారు. హోటల్ దస్పల్లా లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల కంపెనీలు, డీలర్లతో జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం విజన్ 2047 నాటికి జీరో ఉద్గారాలను తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు దేశానికి ఆదర్శంగా ఉంటున్నాయన్నారు. ప్రభుత్వం రవాణా శాఖ లో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్ రావద్దు అని జీవో నెంబర్ 41 కింద ఈవీ పాలసీ తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈవీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం 100 శాతం టాక్స్ మినహాయింపు ఇస్తుందని…ఈవీ పాలసీకి ప్రజల నుండి మంచి స్పందన ఉందన్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ వెలుపల పెరుగుతున్న కొత్త కాలని ల దృశ్య జీవో 263 తీసుకొచ్చిందని, అందులో భాగంగా 20 వేల ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆటోలు ,10 వేల సీఎన్జీ ఆటో లు ,10 వేల ఎల్పీజీ ఆటో లు ,25 వేల రెట్రో ఫీటెడ్ ఎలక్ట్రిక్ ఆటో లకు అనుమతి ఇచ్చిందన్నారు. పాత పెట్రోల్ డీజిల్ ఆటోలు రెట్రో ఫీటెడ్ గా చేసి ఎలక్ట్రిక్ గా మార్చే వాహనాలకు అనుమతి ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వ సంస్థలలో 20శాతం ఈవీ వాహనాలు
ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వాహనాలు 20 శాతం ఈవీ వాహనాలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని మంత్రి పొన్నం వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణలో ఈవీ కంపెనీలు ప్రభుత్వానికి సహకరించాలని, ప్రజలు ఈవి వాహనాలు ఉపయోగించేలా కంపెనీలు విస్తృతంగా ప్రచారం కల్పించాలని కోరారు. నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి సరిపడ ఛార్జింగ్ స్టేషన్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని పొన్నం తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ పాలసీని కంపెనీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. జనవరిలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం జరుగుతుందని..దానిపై మీరు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. స్కూల్ చిల్డ్రన్ కి రోడ్డు భద్రతా, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహనకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు.
ఓఆర్ఆర్ లోపల 2,800ఎలక్ట్రిక్ బస్సులు
రోడ్ సేఫ్టీ గురించి రేపు జిల్లా కలెక్టర్ లతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని పొన్నం తెలిపారు. షో రూమ్ ల వద్ద,పెట్రోల్ బంకుల వద్ద ఇతర ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్ ల సంఖ్యను పెంచాలని, నగరంలో ఓఆర్ఆర్ లోపల పీఎం ఈ -డ్రైవ్ కింద 2800 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టనుందని, ఇప్పటికే 700 బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. మొన్న కొత్తగా 326 కొత్త రూట్లు ఆర్టీసీ బస్సులు నడుపుతుందన్నారు. స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం అని, ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ప్రాసెస్ నడుస్తుందన్నారు. రవాణా శాఖ చెక్ పోస్టులు ఎత్తివేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చాం అని తెలిపారు. ప్రమాదాలను తగ్గించడానికి ఎన్ఫోర్స్మెంట్ బలోపేతం చేశాం అని, ఏజెన్సీలు ఎలక్ట్రిక్ వెహికిల్స్ అమ్మెవారు కొనే వారికి ఒక మొక్క ఇవ్వాలని.. అది చెట్టుగా మారితే కాలుష్యం తగ్గుతుందని సూచించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, జేటీసీ రమేష్, వివిధ ఎలక్ట్రిక్ వాహనాలు కంపెనీల ప్రతినిధులు గోపాల కృష్ణ, సురేష్ రెడ్డి ,గౌతం రెడ్డి ,ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Python Attack Zoo Keeper : జూ కీపర్ పై కొండ చిలువ దాడి.. వీడియో వైరల్
Rakesh Bedi | సక్సెస్ మీట్లో ముద్దు.. రాకేశ్ బేడీపై నెటిజన్ల ట్రోల్స్, వివరణ ఇచ్చిన నటుడు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram