కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్రెడ్డి నాకు గడీలు ఉన్నాయని ఆరోపించారని, అవి ఎక్కడున్నాయో చూపిస్తే ఆయనకే సొంత ఖర్చులతో రిజిస్ట్రేషన్ చేస్తానని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు మండిపడ్డారు
ముందుంది మొసళ్ల పండుగ
మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు ఫైర్
విధాత : కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్రెడ్డి నాకు గడీలు ఉన్నాయని ఆరోపించారని, అవి ఎక్కడున్నాయో చూపిస్తే ఆయనకే సొంత ఖర్చులతో రిజిస్ట్రేషన్ చేస్తానని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి వస్తే దుబ్బాకలో నా ఇల్లు చూపిస్తానంటూ తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ముదిరాజ్లు కాంగ్రెస్ను గెలిపించాలని చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి వారికి ఏం మేలు చేశారో చెప్పాలని నిలదీశారు. దుబ్బాకలో ఓడి మెదక్ ఎంపీగా వచ్చారంటున్న రేవంత్రెడ్డి మరి గతంలో కొడంగల్లో ఓడిపోయి మల్కాజ్గిరిలో ఎంపీగా ఎందుకు పోటీ చేశారో చెప్పాలన్నారు. కామారెడ్డిలో ఓడిన రేవంత్, కేసీఆర్లు రాష్ట్రమంతా ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల సమయం కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే మీ పొరపాటే అవుతుందని హెచ్చరించారు. ఎవరిని పడితే వారిని తిట్టినట్లు నన్ను తిడితే మాత్రం నేను ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. నీకు మెదక్.. ఎంత దూరమో.. నాకు కూడా కొడంగల్ అంతే దూరం నేను అక్కడికి రాలేను అనుకున్నవా అంటూ హెచ్చరించారు. సీఎంగా బాధ్యతాయుతంగా మాట్లాడాలని కోరారు. రఘునందన్ నాట్ ఏ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని నూరుశాతం సక్సెస్ ఫుల్ లీడర్ అని వ్యాఖ్యానించారు. రేవంత్ వయనాడ్ ఎన్నికల ప్రచారంలో కమ్యూనిస్టులను విమర్శించారని, ఇక్కడ ఆ పార్టీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీపీఐ, సీపీఎం ఆఫీస్లో కూర్చుని ఎంపీ ఎన్నికల్లో మద్దతు కోరారని, ఇప్పుడు సీఎం మాట నమ్మాలా… డిప్యూటీ సీఎం మాట నమ్మాలా అని నిలదీశారు. రేవంత్ గుర్తుంచుకోవాలని, ఆయనకు ముందుంది మొసళ్ళ పండుగ అని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలు గెలిస్తే జరిగే పరిణామాలు రేవంత్కు బాగా తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ సిక్త్ సెన్స్ బాగా పని చేస్తోందని, అందుకే మహబూబ్ నగర్లో నాపై కుట్ర జరుగుతోందని చెప్పాడని, అయన కుడి, ఎడమ పక్కన ఉన్న వారితోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు.