కేసీఆర్ బ‌స్సు యాత్ర కాన్వాయ్‌కి ప్రమాదం

బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బస్సుయాత్ర కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం హైదరాబాద్ బస్సుయాత్రలో కేసీఆర్ భారీ కాన్వాయ్‌తో మిర్యాలగూడకు వెలుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది

  • Publish Date - April 24, 2024 / 06:11 PM IST

పరస్పరం ఢీ కొన్న వాహనాలు

విధాత, హైదరాబాద్ : బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బస్సుయాత్ర కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం హైదరాబాద్ బస్సుయాత్రలో కేసీఆర్ భారీ కాన్వాయ్‌తో మిర్యాలగూడకు వెలుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేములపల్లి శివారులో బస్సు వెనుక వరుసగా ఉన్న కాన్వాయ్‌లోని వాహనాలు పరస్పరం ఢీ కొన్నాయి. వరుసగా 10కార్లు ఒకదాని వెనుక మరకొటి ఢీ కొనడంతో పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రమాదంలో కార్లు కొంత దెబ్బతిన్నాయి. అంతకుముందు కేసీఆర్‌కు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వెళ్లే క్రమంలో పలుచోట్ల ప్రజలు, రైతులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. నల్లగొండ ఆర్జాలపల్లి వద్ధ ధాన్యం కొనుగోలు కేంద్రంలోని రైతులు బస్సు వద్దకు వచ్చి కేసీఆర్‌కు తమ సమస్యలు తెలుపుకున్నారు.

Latest News