డీజీపీ రవిగుప్తాకు 2 లక్షల నష్టపరిహారం

విమాన ప్రయాణంలో అసౌర్యానికి గానూ సింగపూర్ ఎయిర్ లైన్స్ పై వేసిన దావాలో నెగ్గిన తెలంగాణ డీజీపీ రవిగుప్తాకు ఆ సంస్థ నుంచి 2 లక్షలు పరిహారంగా మంజూరైంది

  • Publish Date - April 25, 2024 / 04:15 PM IST

సింగపూర్ ఎయిర్‌లైన్స్‌పై నెగ్గిన దావా

విధాత, హైదరాబాద్ : విమాన ప్రయాణంలో అసౌర్యానికి గానూ సింగపూర్ ఎయిర్ లైన్స్ పై వేసిన దావాలో నెగ్గిన తెలంగాణ డీజీపీ రవిగుప్తాకు ఆ సంస్థ నుంచి 2 లక్షలు పరిహారంగా మంజూరైంది. తెలంగాణ డీజీపీ రవి గుప్తా, ఆయన సతీమణి అంజలి గుప్తా మే 23, 2023న హైదరాబాద్ నుంచి సింగపూర్ మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్లారు. వీరు బిజినెస్ క్లాస్ లో ప్రయాణించగా.. వాటిల్లోని రిక్లైనర్ సీట్లు ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ ద్వారా ఆటోమేటిక్‌గా వాలుతున్నాయని ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లే సమయంలో ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ విఫలమవ్వడంతో అవి పని చేయలేదని తెలుసుకున్నారు.

ఈ అసౌకర్యంతో ఇబ్బంది పడ్డ డీజీపీ, బిజినెస్ క్లాస్ టికెట్ల కోసం ఒక్కొక్కరికి రూ.66,750 చెల్లించామని, అయినప్పటికీ ప్రయాణమంతా మేల్కొని ఉండాల్సి వచ్చిందని, ఇది ఎకానమీ క్లాస్ ధర రూ.18,000 కంటే రూ.48,750 ఎక్కువ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక బిజినెస్ క్లాస్ కోసం డబ్బు చెల్లిస్తే తమను ఎకానమీ క్లాస్ ప్రయాణికులుగా పరిగణించారని, అదనపు లెగ్ రూమ్‌ కూడా మినహాయించారని ఆరోపించారు.

దీని పై స్పందించిన సింగపూర్ ఎయిర్ లైన్స్ వారికి కలిగిన అసౌకర్యానికి ఒక్కో వ్యక్తికి 10,000 క్రిస్ ఫ్లయర్‌ మైళ్లను ఆఫర్ చేసింది. దీన్ని ఫిర్యాదుదారులు తిరస్కరించడంతో.. హైదరాబాద్ లోని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్-3 సింగపూర్ ఎయిర్లైన్స్ ని ప్రతి ఫిర్యాదుదారునికి రూ.48,750 చొప్పున మొత్తం రూ.97,500, మే 23, 2023 నుండి వారు రియలైజ్ అయ్యే వరకు 12% వడ్డీ చొప్పున వారికి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అంతేగాక ఫిర్యాదుదారుల మానసిక వేదన, శారీరక బాధల కోసం రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని, అలాగే ఫిర్యాదు ఖర్చుల కోసం రూ.10,000 చెల్లించాలని సింగపూర్ ఎయిర్ లైన్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Latest News