ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానన్న బాధతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది.
విధాత, హైదరాబాద్ : ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానన్న బాధతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా దోరగారిపల్లేలో చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని తేజస్విని బుధవారం విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపం చెందిన తేజస్విని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగారు. పోస్ట్మార్టం నిమిత్తం తేజస్విని మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.