భోగి వేడుకల్లో సందడి చేసిన మంత్రి జగదీష్ రెడ్డి
విధాత: మూడు రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజున నల్గొండ జిల్లా వ్యాప్తంగా లోగిళ్ళలో 'భోగి' మంటలతో ఘనంగా ప్రారంభమయ్యింది. రంగు రంగుల రంగవల్లుల నడుమ భోగి మంటల కాంతులతో ఊరు, వాడల్లోని కూడళ్లు సంక్రాంతి సంబరాలు సంతోషాలతో సందడిగా కనిపించాయి. అందమైన రంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మళ్లను కొలువు దీర్చారు. సూర్యాపేట జిల్లాలోని పలు కూడళ్ల లో సాగిన భోగిమంటల వేడుకల్లో మంత్రి జగదీష్ రెడ్డి సందడి చేశారు. వేడుకలకు మంత్రి రావడంతో మరింత […]

విధాత: మూడు రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజున నల్గొండ జిల్లా వ్యాప్తంగా లోగిళ్ళలో ‘భోగి’ మంటలతో ఘనంగా ప్రారంభమయ్యింది. రంగు రంగుల రంగవల్లుల నడుమ భోగి మంటల కాంతులతో ఊరు, వాడల్లోని కూడళ్లు సంక్రాంతి సంబరాలు సంతోషాలతో సందడిగా కనిపించాయి.
అందమైన రంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మళ్లను కొలువు దీర్చారు.
సూర్యాపేట జిల్లాలోని పలు కూడళ్ల లో సాగిన భోగిమంటల వేడుకల్లో మంత్రి జగదీష్ రెడ్డి సందడి చేశారు. వేడుకలకు మంత్రి రావడంతో మరింత ఉత్సాహంతో కేరింతలు కొట్టి మంత్రితో సెల్ఫీలు దిగారు స్థానికులు. పట్టణంలోని స్థానిక విద్యానగర్ చౌరస్తాలో వార్డు ప్రజలంతా పెద్ద ఎత్తున ఒక చోట చేరి భోగి మంటల కాంతుల మధ్య కోలాటం వేస్తూ ఆనందంగా నృత్యాలు చేసారు.
సూర్యాపేటలో జరిగిన వేడుకల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. సామూహికంగా ప్రజల నడుమ ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు మంత్రి. చెడు పై మంచి విజయానికి ప్రతీక సంక్రాంతి పండుగని, బోగీ మంటల్లో చెడుని ఆహుతి చేసి మంచి చేయాలని ప్రజలకు ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నట్లుగా భారత దేశం కూడా ముందుకు సాగాలని, దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్న సందర్భంలో మళ్ళీ సంక్రాంతి పండుగ వరకు దేశంలో వారు ఆకాంక్షిస్తున్న మార్పు జరగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమం లో మున్సిపల్ చైర్మెన్ పెరుమాళ అన్నపూర్ణ శ్రీనివాస్ దంపతులు, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, గండూరి ప్రకాష్, కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్, కాడారి సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.