అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపానికి గురైంది.
విధాత : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపానికి గురైంది. దీంతో ఆయన హెలికాప్టర్ను వదిలి రోడ్డు మార్గంలో కామారెడ్డి జిల్లాకు బయలుదేరారు.
కామారెడ్డి జిల్లాలో మూడు చోట్ల కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగించాల్సి ఉంది. హెలికాప్టర్ సాంకేతిక లోపంతో ఆయన రోడ్డు మార్గంలో ఆయా సభలకు హాజరైనందుకు వెళ్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార పర్యటనలోనూ హెలికాప్టర్లో మూడుసార్లు సాంకేతిక లోపాలు తలెత్తడం గమనార్హం.